సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సర్కారు వారి పాట నుండి ఫస్ట్ సాంగ్ ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతున్నట్లు నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దానితో ఎప్పటి నుండో ఈ మూవీ సాంగ్స్ కోసం ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని పరశురామ్ పెట్ల తీస్తుండగా టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటులు ఇందులో కీలక పాత్రలు చేస్తున్నట్లు టాక్.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి మది కెమెరా మ్యాన్ గా పని చేస్తున్నారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ అందరి నుండి సూపర్ రెస్పాన్స్ అందుకుని మూవీపై భారీగా అంచనాలు పెంచింది. విషయం ఏమిటంటే, ఇప్పటికే డెబ్భై శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ తదుపరి షెడ్యూల్ కొన్నాళ్ల క్రితం మహేష్ కి కరోనా సోకడంతో వాయిదా పడింది. ఇక లేటెస్ట్ గా పలు ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న న్యూస్ ప్రకారం ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ఫిబ్రవరి 15 నుండి హైదరాబాద్ లో ప్రారంభం అవుతుందని, అక్కడి నుండి టోటల్ గా పూర్తి అయ్యేవరకు మహేష్ పని చేయనున్నారని సమాచారం.

మరోవైపు ఇటీవల తన సోదరుడు రమేష్ బాబు మరణంతో కృంగిపోయిన మహేష్ ప్రస్తుతం ఇంటివద్దనే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారని, మరొక రెండు రోజుల అనంతరం మళ్ళి ఆయన పూర్తిగా బాడీ ఫిట్నెస్ పై దృష్టిపెట్టారనున్నారని టాక్. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే సూపర్ స్టార్ త్వరలో రెడీ కానుండడంతో సరిగ్గా రెండు వారాల తరువాత సర్కారు వారి పాట నెక్స్ట్ షెడ్యూల్ కి స్టార్ట్, కెమెరా, యాక్షన్ రెడీ కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా ఏప్రిల్ 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: