అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. కానీ ఇటీవల మహేష్ బాబు కరోనా బారిన పడటంతో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్తగా కనిపించబోతున్నాడు. సినిమాలో మహేష్ సరసన కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఏప్రిల్ 1న ఈ సినిమా విడుదల కానుంది. ఇక త్రివిక్రమ్ సినిమాలో మహేష్ సరసన ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డేను సెలెక్ట్ చేశారు.
అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మహేష్ బాబు కి మరదలిగా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మలయాళ ముద్దుగుమ్మ 'భీమ్లా నాయక్' సినిమాలో రానా కి భార్య గా నటిస్తోంది. భీమ్లా నాయక్ సినిమాకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ని త్రివిక్రమ్ అందిస్తున్నారు.అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సంయుక్త మీనన్ కు ఫిదా అయిన త్రివిక్రమ్.. మహేష్ సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్లుగా ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది. దీంతో మహేష్ సినిమాలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్గా.. సంయుక్త మీనన్ సెకండ్ హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది...!!