టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం యువ కథానాయికగా వరుసగా మంచి సక్సెస్ లతో కొనసాగుతున్న వారిలో కన్నడ భామ రష్మిక మందన్న కూడా ఒకరు. తొలిసారిగా నాగ శౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఛలో సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయిన రష్మిక ఆ మూవీతో మంచి సక్సెస్ కొట్టింది.

అనంతరం విజిఐ దేవరకొండ తో పరశురామ్ పెట్ల తీసిన గీత గోవిందం మూవీలో నటించి దానితో కూడా సక్సెస్ అందుకున్న రష్మిక, ఆపైన మహేష్ తో సరిలేరు నీకెవ్వరు, నితిన్ తో భీష్మ, అలానే ఇటీవల అల్లు అర్జున్ నటించిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప వంటి సినిమాలతో కూడా వరుస విజయాలు తన ఖాతాలో వేసుకుని హీరోయిన్ గా టాలీవుడ్ ఆడియన్స్ మనసులో మంచి స్థానాన్ని సంపాదించింది. ఇక అటు సోషల్ మీడియాలోనూ రష్మిక మందన్నకి విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా యువతలో ఆమెకి మరింత ఫాలోయింగ్ ఉంది. అయితే విషయం ఏమిటంటే, ప్రస్తుతం అటు కన్నడతో పాటు ఇటీవల ఒక హిందీ సినిమా అవకాశం కూడా అందుకున్న రష్మిక మందన్న, ప్రస్తుతం తమిళ్ లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తలపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజక్ట్ లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టింది రష్మిక.

అది మాత్రమే కాకుండా త్వరలో ప్రారంభం కానున్న ఎన్టీఆర్, కొరటాల సేవల ప్రతిష్టాత్మక సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా నటించనుందని, అలానే మరొక రెండు భారీ టాలీవుడ్ ప్రాజక్ట్స్ లో కూడా కొద్దిరోజుల క్రితం ఆమె ఎంపిక అయిందని, త్వరలో వాటికి సంబంధించి కూడా అధికారికంగా ప్రకటనలు రానున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ కనుక నిజం అయితే రష్మిక నిజంగా నక్క తోక తొక్కినట్లే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: