ఈ చిత్రం అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన చేయడం జరుగుతోంది ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా ప్రారంభించారు. లాక్ డాన్ సమయంలో ఖాళీగా ఉన్న సమయంలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కలిసి ఈ సినిమా కథను చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో రాజమౌళికి నచ్చిన రెండు లైన్లలో ఫైనల్ చేశారట. ఇక అందులో మహేష్ బాబు కు ఫర్ ఫెక్ట్ అనుకున్న కథని లాక్ చేశామని ఇటీవల రాజమౌళి తెలియజేశారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ను పక్కాగా పూర్తి చేయడానికి రాజమౌళికి ఆరు మాసాల గడువు పడుతుందట.
అయితే ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పట్టాలు ఎక్కడం అసాధ్యం అన్నట్లుగా సమాచారం. అయితే ముందు అనుకున్నట్టుగానే డైరెక్టర్ త్రివిక్రమ్ తో మహేష్ బాబు తన సినిమాని ఫినిష్ చేయబోతున్నట్లు సమాచారం. డిసెంబర్లో రాజమౌళి తో సినిమా తీయాలనుకున్న ట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కడానికి ముందు మహేష్ బాబు రెండు నెలల ముందు నుండి రాజమౌళి తనకు కేటాయించాలని కండీషన్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రం 2023 లో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స బ్యానర్ పై కె ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.