గత కొన్ని సంవత్సరాలుగా కమలహాసన్ కు వరస ఫ్లాప్ లు వస్తున్నాయి. దీనితో కమల్ పని అయిపోయింది అంటూ అనేకమంది కామెంట్స్ చేసారు. దీనికితోడు తమిళనాడు ఎన్నికలలో కమలహాసన్ ఘోరంగా ఓడిపోవడంతో ఇక అతడు రెస్ట్ తీసుకోవడం మంచిది అంటూ కొందరు సలహాలు కూడ ఇచ్చారు.


అయితే 67 సంవత్సరాల కమలహాసన్ తన సత్తా ఏమిటో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి రుచి చూపించబోతున్నాడు. లేటెస్ట్ గా కమల్ నటించిన ‘విక్రమ్’ మూవీ పై విపరీతమైన అంచనాలు పెరిగిపోతున్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈమూవీలో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్ లు నటించారు.



కమలహాసన్ తో పాటు మరో ఇద్దరు టాప్ హీరోలు కలవడంతో ఈమూవీ పై భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమాకు ఏర్పడిన క్రేజ్ రీత్యా ఈసినిమాకు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా 150 కోట్ల స్థాయిలో జరగడం కోలీవుడ్ లో షాకింగ్ న్యూస్ గా మారింది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈమూవీ రైట్స్ ను తమిళం తెలుగు హిందీ కన్నడం మరియు మలయాళం వర్షన్ లకు కలిపి 50 కోట్లకు తీసుకున్నట్లు టాక్.


ఈమూవీ పెట్టుబడి 100 కోట్లకు మించి ఉండదని అంటున్నారు. కమల్ హాసన్ ఈ సినిమాతో ఖచ్చితంగా ఒక బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ ను అందుకుంటాడని అప్పుడే ఊహాగానాలు వస్తున్నాయి. వచ్చేనెల విడుదల కాబోతున్న ఈమూవీతో తిరిగి కమల్ మ్యానియా ప్రారంభం అయ్యే ఆస్కారం ఉంది అంటున్నారు. ఇప్పటికే ఈసినిమా ట్రైలర్ కు విశేష స్పందన రావడంతో కమలహాసన్ కు కోట్లు కురవడం ఖాయం అంటున్నారు. అదే నిజం అయితే తమిళనాడు ఎన్నికలలో కమలహాసన్ కు ఎదురైన ఘోరపరాభవం నుండి తేరుకుని తిరిగి మళ్ళీ సినిమాలలో బిజీ అయి మరిన్ని విభిన్నమైన సినిమాలలో నటించే ఆస్కారం ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: