మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట
సినిమా మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం
మాస్ మసాలా సినిమా గా తెరకెక్కగా ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులందరినీ భారీస్థాయిలో మెప్పిస్తుంది అని ఈ
సినిమా యూనిట్ భావిస్తుంది. మహేష్ అభిమానులు సైతం ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ లు చూసిన తర్వాత ఈ చిత్రం అతి పెద్ద హిట్ అవుతుందన్న అంచనాకు వచ్చేసారు.
ఈ నేపథ్యంలో సర్కారు వారి పాట ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ కొనసాగిస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మహేష్ కూడా దీనికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎంతో చురుకుగా పాల్గొంటున్నారు.
ట్విట్టర్ లో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నాడు.
అంతే కాదు సర్కారు వారి పాట యొక్క కాయిన్స్ ను సైతం ఇటీవలే విడుదల చేసి
సినిమా యొక్క రేంజ్ ను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా ఈ
సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు ఎంతో వినూత్నంగా చేస్తున్నారు అని చెప్పవచ్చు. ఒక పెద్ద
హీరో ఈ విధంగా తన సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. మహేష్ బాబు అయితే గతంలో ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో తన సినిమాకు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. మరి సర్కారు వారి పాట చిత్రం ప్రమోషన్స్ కి తగ్గట్టుగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందా అనేది చూడాలి. ఇకపోతే ఈ
సినిమా విడుదల ను అభిమానులు భారీ గా ప్లాన్ చేశారు. ప్రతి ఒక్కరు ఈ
సినిమా బాగా ఉంటుందని చెప్తున్నా నేపథ్యంలో మహేష్ ఈ
సినిమా లో ఏవిధంగా కనిపిస్తాడో, ఎలాంటి
మాస్ అవతారంలో కనిపిస్తాడో చూడాలి.