నిజానికి ఒకవేళ ఆచార్య సినిమా అంచనాలను అందుకోలేకపోయినా ఇంతటి నెగెటివిటి తనను చుట్టేస్తుందని దర్శకుడు కొరటాల కూడా ఊహించి ఉండరు. ఒక వైపు మెగా ఫ్యాన్స్ మరో వైపు సినీ లవర్స్ మరియు విశ్లేషకులు అంతా కలిసి కొరటాలపై విమర్శల జడివాన కురిపిస్తున్నారు. ఇప్పట్లో ఈ వెల్లువ తగ్గేలా కనిపించడం లేదు. మరి ఈ రేంజ్ లో కొరటాల బుక్ అవుతారని అసలు ఎవరు ఊహించనే లేదు. అయితే ఇంతటి పరాజయాన్ని అందుకుని సెంటర్ పాయింట్ అయిన కొరటాల తన తదుపరి చిత్రంలో మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అనుకున్నది అనుకున్నట్లు స్క్రీన్ పై ప్రతిబింబించేలా ప్లానింగ్ చేస్తున్నారు.
తారక్ తో తను చేయబోయే చిత్రం ఆచార్య మిగిల్చిన నీలి ఛాయలను కనపడకుండా రంగులతో నింపేయాలని మరింత దృఢంగా నిశ్చయించుకున్నారట. ఇక తారక్ తో తాజా చిత్రం జనతా గ్యారేజ్ ను మించిన బలమైన కథతో అల్లుకుంటుందని తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉందనితుందట. దాదాపు 150 కోట్లకు పైగా ఈ సినిమాకి బడ్జెట్ ఫైనల్ చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ ట్రీట్ గా ఈ ప్రాజెక్ట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రణాళికలు జరుగుతున్నట్లు సమాచారం. మొత్తానికి ఆచార్య చిత్రంతో బాగా అలెర్ట్ అయ్యారు కొరటాల.