మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట..దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా కోసం ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఇప్పటికే ఈ సినిమా విడుదల వాయిదా పడింది..మహేష్ వల్ల కొంత షూటింగ్ పోస్ట్ ఫోన్ కావడంతో సినిమా లెట్ అయ్యింది. ఇప్పుడు అన్నీ కార్యక్రమాలను పూర్తీ చేసుకొని మరి కొద్ది గంటల్లో ఈ సినిమా విడుదల కానుంది.


ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు 'సర్కారు వారి పాట'పై అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది..కాగా, ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన నటన ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాపై ఆసక్తి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ భారీ ఎత్తున నెలకొంది. ఇప్పటికే అక్కడి ఆడియెన్స్ మహేష్ మేనియాతో ఊగిపోతున్నారు..సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.



ఓవర్సీస్‌లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న స్టార్‌గా మహేష్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు 'సర్కారు వారి పాట' చిత్రం తో మరోసారి తన స్టామినా ఏమిటో ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద చూపించేందుకు రెడీ అయ్యాడు. ఒక్క అమెరికాలో నే సర్కారు వారి పాట ప్రీ సెల్ 650K మిలియన్ డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసిందంటే, మహేష్ క్రేజ్ అక్కడ ఏ రేంజ్‌లో ఉందో ఊహించుకోవచ్చు. ఈ సినిమా అడ్వాన్స్ టికెట్స్ ప్రీసేల్స్ రూపంలోనే 1 మిలియన్ డాలర్లు వసూల్ చేస్తుందని సినీ వర్గాల్లొ టాక్ వినిపిస్తోంది.ఆ సినిమా ఫ్యాన్స్ మార్క్ ను రీచ్ అవుతుందో లేదో రేపు తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: