సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట మూవీ రేపు అనగా మే 12 వ తేదీన గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.  గీత గోవిందం సినిమా తర్వాత పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు నటిస్తున్న సినిమా కావడంతో సర్కారు వారి పాట సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాల నెలకొని ఉన్న సర్కారు వారి పాట సినిమా నుండి ఇప్పటి వరకు చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు  కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.  ఇలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా అదే రేంజ్ లో విడుదల కాబోతుంది.  ప్రపంచ వ్యాప్తంగా సర్కారు వారి పాట సినిమా ఎన్నో థియేటర్ లలో  విడుదల అవుతుందో  చూద్దాం.

నైజాం : 380
సీడెడ్ : 250 ప్లస్
ఆంధ్ర : 540 ప్లస్
సర్కారు వారి పాట మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1200 ల థియేటర్ లలో విడుదల కాబోతుంది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 220.
ఓవర్సిస్ లో 700 ప్లస్ థియేటర్ లలో ఈ మూవీ విడుదల కాబోతుంది.

 
సర్కారు వారి పాట మూవీ ప్రపంచవ్యాప్తంగా 2150 థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఇలా మొదటి రోజు అదిరిపోయే రేంజ్ దియేటర్ లలో ఈ సినిమా విడుదల అవుతూ ఉండడంతో ఈ సినిమా మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకునే అవకాశం పుష్కలంగా ఉంది అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: