మహేష్ ఫ్యాన్స్ ఎప్పుడేప్పుడా అని ఎదురు చూస్తున్న సర్కారు వారి పాట' ఈరోజు రిలీజ్ అయ్యింది.మహర్షి నుంచి మహేష్ బాబు ఖాతాలో వరుస హిట్ లు పడుతున్నాయి.ఇటీవల వచ్చిన సరిలేరు నీకెవ్వరు  సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు మహేష్..తాజాగా సర్కారు వారి పాట సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. సినిమా మొదలైనప్పటి నుంచి మంచి టాక్ ను అందుకుంటుంది. ఈ సినిమా కూడా మంచి టాక్ ను అందుకుందని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి. మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రంలో,సముద్రఖని , వెన్నెల కిషోర్ మరియు సుబ్బరాజు కీలక పాత్రలో నటించారు..ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.



సినిమా కథ విషయానికి వస్తే..బ్యాంకింగ్ మోసాల నేపథ్యంలో ఈ సినిమా మొదలవుతుంది. మహేష్ బాబు పాత్ర యూఎస్ లో ఓ బ్యాంక్‌ లో రికవరీ ఎంప్లాయ్‌గా మహేష్ బాబు కనిపిస్తాడు. తమ బ్యాంకును చీట్ చేసిన బిజినెస్‌ మెన్‌ల నుంచి తెలివిగా మహేష్ డబ్బులు ఎలా వసూలు చేస్తాడు. ఇక అమ్మాయిలకు ఆమడ దూరంలో ఉండే మహేష్ కళావతి (కీర్తి సురేష్)తో ఎలా ప్రేమలో పడ్డాడు ? ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తీసుకుంది ? అసలు మహేష్ గతం ఏమిటి ? అనేది మిగిలిన కథ..ఇంటర్వెల్ కి ముందు వచ్చే యాక్షన్ సీక్వెన్స్, మహేష్ పాత్రతో ముడిపడిన పాత్రల ఎమోషన్స్ అద్భుతంగా అనిపిస్తాయి. 



ఫస్ట్ హాఫ్ ను మించిన విధంగా సెకండ్ హాప్ ఉంటుంది.సెకండాఫ్ లో వచ్చే డ్రామా అండ్ కామెడీ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి..రొమాన్స్, యాక్షన్, కామెడీ కథా చిత్రంగా డైరెక్టర్ చక్కగా చూపించారు. మహేష్ అద్భుతంగా నటించారు. మహేష్ -వెన్నల కిషోర్ కాంబినేషన్‌ అదిరింది. కీర్తి సురేష్ క్యారెక్టర్ అయితే, ఒక సర్‌ప్రైజ్‌ గా ఉంటుంది. కథను ఎక్కడా సాగ తీయకుండా,సుత్తి లేకుండా చిత్రీకరించారు.మొత్తానికి కథ పరంగా మంచి మార్కులను వేయించుకుంది. సినిమా రేటింగ్ కూడా 4.5 ఉంది. మొదటి షో టాక్ ప్రకారం సినిమా బాగుందనే టాక్ వినిపిస్తోంది. కలెక్షన్స్ ఎంత వరకూ ఉంటాయో సాయంత్రం చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: