దర్శకుడు పరశురామ్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పరశురామ్ 'యువత' సినిమాతో దర్శకుడిగా తన కెరియర్ ని మొదలు పెట్టి ఆ తర్వాత ఆంజనేయులు ,  సోలో , శ్రీరస్తు శుభమస్తు , గీత గోవిందం సినిమాలకు దర్శకత్వం వహించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న దర్శకులలో క్రేజీ దర్శకుడిగా మారిపోయాడు.  ఇది ఇలా ఉంటే గీత గోవిందం సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న పరుశురామ్ ,  సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ కి దర్శకత్వం వహించే అవకాశం దక్కింది.  

అందులో భాగంగా దర్శకుడు పరశురామ్ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా సర్కారు వారి పాట మూవీ ని తెరకెక్కించాడు.  ఈ సినిమా ఈ రోజు అనగా మే 2 వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది.  ఈ సందర్భంగా గా దర్శకుడు పరశురామ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా పరశురామ్ మాట్లాడుతూ...  దర్శకుడు పూరి జగన్నాథ్ ను నేను అన్నయ్య అని పిలుస్తూ ఉంటాను.  పూరి జగన్నాథ్ ది మాది ఒకే ఊరు కావడం వలన ఆయన తో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది.

అందుకే  మా ఊరు నుంచి ఒక సారి హైదరాబాద్ వచ్చేశాను. సినిమా ఫీల్డ్ లోకి వద్దామని అనుకుంటున్నట్టుగా పూరి జగన్నాథ్ కి చెప్పాను. దాంతో పూరి జగన్నాథ్  'ఇండస్ట్రీ అంటే ఏమనుకుంటున్నావ్ .. ముందు బాగా చదువుకో ..' అని చెప్పి పూరి జగన్నాథ్ నాపై కోప్పడ్డాడు. అలా పూరిజగన్నాథ్ నాపై కోప్పడ్డంతో నేను మళ్లీ మా ఊరికి వెళ్లిపోయాను. అలా తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు పరుశురామ్ ,  పూరి జగన్నాథ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: