ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోల రేంజ్లో భారీగా పెరిగిపోతోంది అని చెప్పవచ్చు. ఎందుకంటే బాలీవుడ్ హీరోలకు సమానంగా లేదా అంతకు మించి అనేలా టాలీవుడ్ హీరోలు ఉత్తరాది రాష్ట్రాలలో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోలు వరుస సినిమాలతో ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధం అవడమే కాకుండా మొత్తం దేశ వ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటున్నారు. ఇక ఇదివరకే ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ , అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు నటించిన అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి మంచి గుర్తింపును తెచ్చుకుంటాయి.

ఇక తాజాగా మరొక యంగ్ హీరో సినిమా కూడా వాణిజ్య స్థాయిలో విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో అనన్య పాండే కొన్ని ఎమోషనల్ వ్యాఖ్యలు చేసింది. తాజాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం లైగర్.. ఇక ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో స్థాయిలో తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా జరుపుకుంటోంది. ఇక మే 25వ తేదీన విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా లైగర్ సినిమా గురించి ఎన్నో విషయాలను వెల్లడించింది. ఇక ఆమె మాట్లాడుతూ ఈ సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది.  ఇక షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండ , దర్శక నిర్మాతలతో కలిసి ఎంతో సరదాగా గడిపేవాళ్ళం అంటూ లక్షణాలను గుర్తుచేసుకుంది . అంతేకాదు ఆ క్షణాలు మళ్లీ రావని ఆమె కొద్దిగా ఎమోషనల్ అయినట్లు సమాచారం. ఇక లైగర్ సినిమా షూటింగ్ సమయంలో గడిపిన ఆ క్షణాలు మళ్ళీ ఎప్పటికీ రావు అని చెప్పవచ్చు. ఇక ప్రతి ఒక్కరు ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: