అనీల్ రావిపూడి లేటెస్ట్ మూవీ ‘ఎఫ్ 3’ ట్రైలర్ కు విశేష స్పందన రావడంతో ఈ మూవీ కూడ బ్లాక్ బష్టర్ హిట్ కాబోతోంది అన్న భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. తన సినిమాలలోని పాత్రల ద్వారా సెటైర్లు వేయించడంలో దిట్ట అయిన అనీల్ రావిపూడి ఈమూవీలో ఇప్పుడు పెరిగిపోతున్న పాన్ ఇండియా మూవీ మ్యానియా పై సెటైర్లు వేయించినట్లు సంకేతాలు వస్తున్నాయి.


ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా సినిమా తీస్తున్నామంటూ ప్రచారం చేసుకోవడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. అనువాద చిత్రానికి ఒరిజినల్ కి తేడా లేకుండా పోయింది. అన్ని భాషల్లోనూ అనువదించి రిలీజ్ చేస్తే చాలు అది పాన్ ఇండియా మూవీ అంటున్నారు. దీనితో మీడియం రేంజ్ హీరోల నుండి టాప్ హీరోల వరకు అందరి దృష్టి పాన్ ఇండియా మూవీల పైనే ఉంది. ఈ పాన్ ఇండియా మ్యానియాను దృష్టిలో పెట్టుకుని అనీల్ రావిపూడి ‘ఎఫ్ 3’ లో కామిడీ సీన్స్ తీసినట్లు అర్థం అవుతోంది.


ఈమూవీలో వెన్నెల కిషోర్ పాత్రతో ఈ పాన్ ఇండియా మ్యానియా పై అనేక సెటైర్లు వేయించాడు. దీనితో టాప్ హీరోల అభిమానులు అనీల్ రావిపూడి పై ఈమూవీ విడుదల కాకుండానే అసహనంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ మరొకవైపు వారు చేసే పాన్ ఇండియా సినిమాలను ఏ దైర్యంతో టార్గెట్ చేస్తున్నాడు అంటూ కొందరు అనీల్ రావిపూడిని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.


గతంలో శ్రీనువైట్ల మంచి టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఇలాగే టాప్ హీరోలను టార్గెట్ చేస్తూ కొన్ని సెటైర్లు తన పాత్రలు ద్వారా వేయించాడు. ఆతరువాత శ్రీను వైట్ల హవా పూర్తిగా తగ్గిపోయింది. ఇలాంటి ఉదాహరణలు తన ఎదుట ఉండి కూడ అనీల్ రావిపూడి ఇలా పాన్ ఇండియా మూవీ కల్చర్ పై ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అంటూ అతడి అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: