మెగాస్టార్ చిరంజీవి కి చాలా రోజుల తర్వాత ఆచార్య సినిమా ద్వారా భారీ ఫ్లాప్ ఎదురయింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచే నెగటివ్ టాక్ తెచ్చుకోగా చివరకు ఈ సినిమా భారీ నష్టాలతో బయట పడింది అని చెప్పవచ్చు. దీనివల్ల మెగాస్టార్ సినిమాల విషయంలో చాలా మార్పులు చేయడం జరుగుతుందని వార్త ఇప్పుడు బయటకు వినబడుతుంది. మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ అనే సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయబోతున్నాడు.

ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఈ మూడు చిత్రాలు పూర్తయిన తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనున్నాడు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి సినిమాల ఆర్డర్ లో మార్పులు చేయడం జరుగుతుంది. ముందుగా మెహర్ రమేష్ దర్శకత్వంలోని భోళా శంకర్ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నాడు. ఆ తరువాత గాడ్ ఫాదర్ సినిమా విడుదల చేయాలని చూస్తున్నాడు. ఆచార్య సినిమా అయిన తర్వాత ఈ విధమైన నిర్ణయం చిరంజీవి తీసుకోవడం అందరిలో ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తుంది.

ఇకపోతే ఇంతకుముందు సినిమాల విషయం లో ఉన్న స్క్రీన్ ప్లే విషయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి మార్పును కోరుకుంటున్నారు. ఆచార్య సినిమా విడుదలకు ముందు ఉన్న తాను చేస్తున్న సినిమాల స్క్రీన్ ప్లే మార్చి ప్రేక్షకులకు నచ్చే విధంగా వాటిని ముందుకు తీసుకువస్తున్నారు. గతంలోలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో కాకుండా హిట్ కొట్టాలని అభిమానులను అలరించే సినిమాలు చేయాలని మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ఈ మార్పులు ఏ విధమైన ఫలితాన్ని తెచ్చి పడతాయో చూడాలి. అందరు మెగా అభిమానులు మాత్రం చిరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మళ్ళీ హిట్ సినిమా తో కం బ్యాక్ చేయాలనీ ఆశిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: