టాలీవుడ్ బుట్టబొమ్మ
పూజా హెగ్డే పనైపోయింది అని చాలామంది చాలా రకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆమెకు వరుస ఫ్లాపులు రావడమే ఈ రకమైన వ్యాఖ్యలు బయటకు రావడానికి ముఖ్య కారణం. ఆమె
హీరోయిన్ గా నటించిన
ప్రభాస్ రాధే
శ్యామ్ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది ఆ తర్వాత చేసిన ఆచార్య
సినిమా కూడా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. ఆ విధంగా రెండు భారీ చిత్రాలు ఫ్లాప్ కావడంతో ఈమెకు ఈ విధమైన విమర్శలు వస్తున్నాయని చెప్పాలి.
ఓవైపు
ప్రభాస్ అభిమానులు ఇంకొకవైపు మెగా అభిమానులు ఇద్దరు కూడా ఈ
హీరోయిన్ పెద్దగా కలిసి రావడం లేదనే వార్తలు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె మహేష్ సరసన
త్రివిక్రమ్ దర్శకత్వంలో ని సినిమాలో చేస్తోంది. ఈ చిత్రం ఏ మాత్రం తేడా కొట్టినా కూడా ఆమె కెరీర్ గల్లంతే అవుతుందని చెప్పాలి. తెలుగులో ఆమె చేసిన సినిమాలన్నీ కూడా విజయాన్ని అందుకోవడంతో ఇప్పటిదాకా ఆమెకు తెలుగు లేకుండా పోయింది ఇప్పుడు డిజాస్టర్ రావడంతో ఆమె నెంబర్ వన్ స్థానం సంగతి పక్కన పెడితే
సినిమా అవకాశాలైనా వస్తాయేమో చూడాలి.
తాజాగా ఈ ముద్దు గుమ్మ తాను నటించబోయే సినిమాల గురించి వెల్లడించింది. అంతే కాదు నటించాలి అనుకునే హీరోల గురించి కూడా వెల్లడించింది. రౌడీ స్టార్
విజయ్ దేవరకొండ తో ఆమె నటించాలన్న కోరికను వెల్లడిం చింది. మరి
విజయ్ దేవరకొండ చేయబోయే భవిష్యత్తు సినిమాల లో ఈమె
హీరోయిన్ గా చేస్తుందా అనేది చూడాలి. మరి తన పై వస్తున్న విమర్శలకు
పూజా హెగ్డే ఎలాంటి రకమైన సమాధానం చెబుతుందో చూడాలి. తెలుగు లో మాత్రమే కాకుండా తమిళం లో కూడా ఆమె తన హవా కొనసా గించిన విధంగా చేసుకుంటుంది.
బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తుంది.