సూపర్ స్టార్ మహేష్ నటించిన “సర్కారు వారి పాట” సినిమా మంచి సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మే 12వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇక ఇదిలా ఉంటే కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. ఒక హీరో సినిమాని మరొక హీరో ప్రమోట్ చేసే దిశగా సోషల్ మీడియాలో అనేక రకాల పాజిటివ్ కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో అందరి కంటే ముందు సూపర్ స్టార్ మహేష్ ఉన్నాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. భీమ్లా నాయక్, ఆచార్య, పుష్ప, RRR, అఖండ సినిమాలు రిలీజ్ అయ్యాక సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆయన అభిప్రాయాలు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ గా కామెంట్ రూపంలో తెలపడం జరిగింది.కానీ మహేష్ నటించిన “సర్కారు వారి పాట” సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతున్నా కూడా ఇండస్ట్రీలో ప్రభాస్ తప్ప మారే హీరో సోషల్ మీడియాలో రెస్పాండ్ కాలేదు. మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ నటించిన “ఆచార్య” సినిమాకి మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చి హెల్ప్ చేశారు. కనీసం “ఆచార్య” సినిమా యూనిట్ కొంచెం కూడా విశ్వాసం లేకుండా మహేష్ “SVP” గురించి ఏమాత్రం రియాక్ట్ కాలేదు.



పైగా ఉద్దేశపూర్వకంగా మెగా హీరో అభిమానులు ఎన్నో విధాలుగా నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని “సర్కారు వారి పాట” సినిమా నిర్మాతలు కూడా సోషల్ మీడియాలో తెలియజేయటం జరిగింది. ఈ పరిణామంతో ఇండస్ట్రీలో మహేష్ కి హిట్ పడితే మిగతా హీరోలు కుళ్లుకుంటున్నారు.. అందువల్లే “సర్కారు వారి పాట” సినిమాకి ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు.. వాళ్ళ కుళ్ళు బుద్దితో సోషల్ మీడియా లో అడ్డంగా బుక్కయ్యారు అని అంటున్నారు.కరోనా మహమ్మారి వచ్చాక ఒకరి సినిమాలను మరొకరు ప్రోత్సహించే రీతిలో సూపర్ స్టార్ మహేష్ మంచి మనసుతో ముందుకొచ్చిన గాని ఆయన సినిమాకి మిగతా స్టార్ హీరోల నుండి అయితే అసలు ఎటువంటి రెస్పాన్స్ లేకపోవటం ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా మహేష్ బాబు “సర్కారు వారి పాట” బ్లాక్ బస్టర్ కావటంతో మహేష్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు. సినిమా యూనిట్ కూడా ఈ సినిమా సక్సెస్ సంబరాలు చేసుకుంటూ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: