ఓవైపు నార్త్ ఇండియాలో మన సౌత్ సినిమాలు వసూళ్ల మోత మోగిస్తూ అక్కడి మార్కెట్లో ఆధిపత్యం చలాయిస్తుంటే.. మరోవైపు హిందీ సినిమాలు మాత్రం తమ అడ్డాలో దారుణమైన ఫలితాలు అందుకుంటుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.గత ఆరు నెలల్లో కూడా ఒక్క 'కశ్మీర్ ఫైల్స్' తప్ప ఏ బాలీవుడ్ పెద్ద సినిమా కూడా పెద్దగా ప్రభావం చూపింది లేదు.అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, అజయ్ దేవగణ్ ఇంకా జాన్ అబ్రహాం లాంటి పెద్ద స్టార్ల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. వీటిలో 83, రన్ వే 34 ఇంకా బచ్చన్ పాండే సినిమాలకు మంచి టాక్ వచ్చినా ఫలితం లేకపోయింది. ఇక నెగెటివ్ టాక్ తెచ్చుకున్న 'ఎటాక్' మూవీ అయితే అస్సలు అడ్రస్ లేకుండా పోయింది.ఇక ఓవరాల్ రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. బాలీవుడ్ పెద్ద సినిమాలకు ఓపెనింగ్స్ అనేవి అసలు మరీ దారుణంగా వస్తుండటం పెద్ద షాక్ అని చెప్పాలి. రన్ వే 34, ఎటాక్ సినిమాలకు రూ.3-4 కోట్ల మధ్య వసూళ్లు రావడం అక్కడి ట్రేడ్ పండిట్లకు కూడా పెద్ద షాకే. ఇప్పుడు ఈ కోవలోని ఇంకో సినిమా కూడా చేరింది. ఇక అదే జయేష్ భాయ్ జోర్దార్.యశ్ రాజ్ ఫిలిమ్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలో రణ్వీర్ సింగ్ లాంటి పెద్ద హీరో నటించిన సినిమానే ఈ జయేష్ భాయ్ జోర్దార్.



బాలీవుడ్ సినిమాలకు వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా ఏమాత్రం ప్రభావం చూపుతుందో అని ముందు నుంచి కూడా అనేక రకాల సందేహాలు కలిగాయి. ఎందుకంటే ఇందులో హిందీ ప్రేక్షకులు ప్రస్తుతం కోరుకుంటున్న మాస్ అంశాలు అస్సలు కనిపించలేదు. ట్రైలర్ కూడా ఏమంత ఎగ్జైటింగ్‌గా లేదు. లో బజ్ మధ్య సినిమా విడుదల అయ్యింది. ఇక దీనికి తోడు బ్యాడ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి పెద్ద షాకే తగిలింది.మొదటి రోజు ఇండియాలో కేవలం రూ.3 కోట్ల నెట్ వసూళ్లు  మాత్రమే సాధించిందీ చిత్రం. నాలుగేళ్ల ముందు రణ్వీర్ సింగ్ నటించిన 'సింబా' మొదటి రోజే రోజు రూ.20 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టడం విశేషం. అలాంటిది ఇప్పుడు తొలి రోజు అతడి సినిమా వసూళ్లు కేవలం రూ.3 కోట్లకు పరిమితం కావడం చూస్తే.. కొవిడ్ తరువాతి పరిస్థితుల్లో బాలీవుడ్ మార్కెట్ ఎంతగా దెబ్బ తిందో చెప్పడానికి ఇదే రుజువు. స్టార్ ఇమేజ్ ఏమాత్రం వర్కవుట్ కాకపోవడం ఇంకా రోజు రోజుకూ తమ సినిమలకు వసూళ్లు పడిపోతుండడం బాలీవుడ్‌ను అంతకంతకూ బాగా కలవరపాటుకు గురి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: