ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటుచేసుకుంటాయి.. తన పుట్టినరోజు నాడు కేరళలోని కాసరగోడుకు చెందిన నటి.. షహన అనుమానాస్పద స్థితిలో మరణించింది. పలు రియాలిటీ షోలో డాన్స్ లతో షో లతో అలరించిన టినా మరణ వార్త మరువకముందే ఇప్పుడు తాజాగా మరోక నటీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు తెలుస్తోంది. పలు సీరియల్స్ లో బెంగాలీలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటి" పల్లబిడే". అకస్మాత్తుగా తను నివాసం ఉంటున్న ఫ్లాట్ లో ఉరి వేసుకుని మరణించింది. ప్రస్తుతం ఈమె వయస్సు 21 సంవత్సరాలు.


పల్లబిడే మరణించడంతో ఆమె అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.పల్లబిడే తన స్నేహితుడు షాగ్నిక్  చక్రవర్తితో కలసి కలకత్తాలో ఒక అద్దె భవనంలో నివసిస్తూ ఉండేవారు అయితే గత ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది ఈమె. తాను ఉంటున్న ఫ్లాట్ లో ఉరి వేసుకొని ఒక దూలానికి వేలాడుతూ కనిపించిందట. దీంతో చుట్టు పక్కల వారు ఈ విషయాన్ని తెలియజేసి ఆ తరువాత పోలీసులకు సమాచారం అందించారు షాగ్నిక్. కాగా గత కొంత కాలంగా తన స్నేహితుడు షాగ్నిక్ ఫ్లాట్లోనే ఈమె నివసిస్తోంది.

అయితే ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే విషయం మాత్రం మిస్టరీగా మారుతోంది. రేష్మ జాపి, సరస్వతి, మోన్మా నేనా తదితర సీరియల్స్ లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఆదివారం రోజున షూటింగ్ కు వెళ్లాల్సి ఉండగా అయితే ఇంతలోనే ఇలాంటి దుర్ఘటన జరిగిందట. ఈ సంఘటన పరిశీలించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఇలా చేసుకున్న లేదంటే కుటుంబ తగాదాల వల్ల ఇలా చేసుకుందాం.. వృత్తిపరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ప్రేమ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలియజేశారు. ప్రస్తుతం తన స్నేహితుడు షాగ్నిక్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: