టాలీవుడ్ స్టార్ కథానాయికల్లో కీర్తి సురేష్ కూడా ఒకరు. తొలిసారిగా నేను శైలజ మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయిన కీర్తి సురేష్మూవీ ద్వారా మంచి సక్సెస్ ని అందుకున్నారు. రామ్ హీరోగా తిరుమల కిషోర్ తీసిన ఈ సినిమా తరువాత పవన్ తో అజ్ఞాతవాసి మూవీ లో ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్, అనంతరం నాగ అశ్విన్ తీసిన ఒకప్పటి గొప్ప నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి మూవీలో సావిత్రి పాత్రలో అత్యద్భుత నటన ప్రదర్శించి నటిగా విపరీతమైన క్రేజ్ తో పాటు ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకుంది.
ఇక అక్కడి నుండి మరింతగా ఇటు టాలీవుడ్ తో పాటు అటు కోలీవుడ్ లో సైతం మంచి ఛాన్స్ లు సొంతం చేసుకున్న కీర్తి సురేష్, ఇటీవల మాత్రం ఆశించిన స్థాయి సక్సెస్ లు అందుకోలేకపోయారు. ఇటీవల ఆమె నటించిన పెద్దన్న, మరక్కార్, గుడ్ లక్ సఖి, పెంగ్విన్ వంటి వంటి సినిమాలు పెద్దగా ఆడలేదు. కొద్దిరోజుల క్రితం అమెజాన్ లో రిలీజ్ అయిన చిన్ని మూవీలో ఎంతో మాస్ పాత్రలో నటించిన కీర్తి బాగా పేరు అందుకున్నప్పటికీ, సినిమా మాత్రం మిశ్రమ స్పందన అందుకుంది.

దానితో కీర్తి సురేష్ కెరీర్ చాలా వరకు ఇబ్బందుల్లో పడ్డట్లు మీడియా మాధ్యమాల్లో పలు కథనాలు ప్రచారం అయ్యాయి. అయితే లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ హీరోగా వచ్చిన సర్కారు వారి పాట మూవీ ఎన్నో భారీ అంచనాలతో రిలీజ్ అయి ప్రస్తుతం భారీ హిట్ దిశగా దూసుకెళ్తోంది. పరశురామ్ పెట్ల తీసిన ఈ సినిమాలో మహేష్, కీర్తి ల జోడీకి ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ లభించింది. ప్రస్తుతం అదరగొట్టే కలెక్షన్స్ తో దూసుకెళుతోంది సర్కారు వారి పాట. కాగా చాలా రోజుల తరువాత సర్కారు వారి పాట రూపంలో తమ హీరోయిన్ మంచి హిట్ కొట్టడంతో కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: