సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ కథానాయికగా నటించగా,  ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూర్చాడు.  మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా చాలా గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా మే 12వ  తేదీన థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే.  

థియేటర్ లలో  విడుదల అయిన మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ ను బాక్సాఫీస్ దగ్గర తెచ్చుకున్న సర్కారు వారి పాట సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్ లను రాబడుతోంది. సర్కారు వారి పాట సినిమాకు  బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ రావడంతో విడుదలైన రెండు రోజుల్లోనే ఈ సినిమా 103 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్లను రాబడుతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  

అసలు విషయం లోకి వెళితే... సర్కారు వారి పాట మూవీ 'ఓ టి టి' హక్కులను  ప్రముఖ 'ఓ టి టి' సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ సొంతం చేసుకున్నట్లు,   భారీ మొత్తం వెచ్చించి సర్కారు వారి పాట సినిమా 'ఓ టి టి'  హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసుకున్నట్లు,  దీంతో ఈ మూవీ థియేట్రికల్‌ రన్‌ పూర్తైన నాలుగు వారాల తర్వాత ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు ఒక వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: