మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే అతడు, ఖలేజ సినిమాలు తెరకెక్కాయి. అతడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించగా, ఖలేజా సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ బుల్లితెరపై మాత్రం ఎంతో మంది ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూ వస్తోంది. ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.

ఇది ఇలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్లో మూడో సినిమా కూడా తెరకెక్కబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇక ఈ నెల 31 వ తేదీన వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేయనున్నట్టు  తెలుస్తోంది. ఈ నెల 31 వ తేదీన కృష్ణ పుట్టినరోజు .. ఈ సందర్భంగా మహేష్ బాబు,  త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా టైటిల్ ను ప్రకటించనున్నట్టు ఒక టాక్ ఇండస్ట్రీ  వర్గాల్లో నడుస్తుంది.

హారిక అండ్ హాసిని బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కబోతుంది.  ఈ సినిమాలో, మహేశ్ బాబు సరసన  పూజ హెగ్డే హీరోయిన్ గా నటించబోతోంది. ఈ మూవీ కి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ,  దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా బాక్సాఫీస్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని ప్రస్తుతం విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. సర్కార్ వారి పాట సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా, ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: