అందాల ముద్దుగుమ్మ కియారా అద్వానీ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీ లో తన కెరియర్ ని మొదలు పెట్టిన కియారా అద్వానీ ధోని అన్ టోల్డ్ స్టోరీ సినిమాతో బాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ సినిమా తర్వాత తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలో నటించి తన అందచందాలతో, నటనతో తెలుగు ప్రేక్షకులను  కీయారా అద్వానీ ఫిదా చేసింది.  అలా బాలీవుడ్... టాలీవుడ్ ఇండస్ట్రీలో తన అందచందాలతో , నటనతో అలరించిన కీయారా అద్వానీ ప్రస్తుతం కూడా బాలీవుడ్... టాలీవుడ్ ఇండస్ట్రీ సినిమాలలో నటిస్తూ తన కెరియర్ ను ఫుల్ స్పీడ్ లో ముందుకు సాధిస్తుంది.

ప్రస్తుతం కియారా అద్వానీ బాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటిస్తుంది. అలాగే తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న 'ఆర్ సి 15' సినిమాలో రామ్ చరణ్ సరసన కీయారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.  ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతోంది.  ఇది ఇలా ఉంటే కియారా అద్వాని కి మరో క్రేజీ తెలుగు సినిమా నుండి ఆఫర్ వచ్చినట్లు ఒక వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే...  రెబల్ స్టార్ ప్రభాస్,  సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా తెరకెక్కబోతున్న విషయం మన అందరికి తెలిసిందే.

ఈ సినిమాలో హీరోయిన్ గా కీయారా అద్వానీ ని లేదా రష్మిక మందన ను తీసుకునే అవకాశాలు ఉన్నట్లు కొన్ని రోజుల క్రితం అనేక వార్తలు వచ్చాయి.  అయితే ప్రస్తుతం స్పిరిట్ చిత్ర బృందం ప్రభాస్ సరసన స్పిరిట్ మూవీలో  కియారా అద్వాని  ని హీరోయిన్ గా తీసుకోవడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.  ప్రభాస్ హీరోగా తెరకెక్కబోయే స్పిరిట్ మూవీ లో హీరోయిన్ గా నటించే అవకాశం  కియారా అద్వాని దాదాపుగా కన్ఫామ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ వార్తపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: