సొట్టబుగ్గల సుందరి  తాప్సీ 'ఝుమ్మంది నాదం' మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అనేక టాలీవుడ్ మూవీ లలో హీరోయిన్ గా నటించిన తాప్సి టాలీవుడ్ ఇండస్ట్రీ లో పెద్దగా విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకోలేకపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన తాప్సీ కి బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మంచి అవకాశాలు లభించడం, అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు కూడా మంచి విజయాలను సాధించడంతో ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో తాప్సి క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది.  

నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సి కొంత కాలం క్రితమే 'ఔట్ సైడెర్స్ ఫిలిమ్స్' అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి , అందులో మూవీ లను నిర్మిస్తున్న  విషయం మన అందరికీ తెలిసిందే.  అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తాప్సి,  సమంత ప్రధాన పాత్రలో తన నిర్మాణ సంస్థ ద్వారా ఒక సినిమాను నిర్మించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.  ఇది ఇలా ఉంటే సమంత ఇప్పటికే శాకుంతలం, యశోద సినిమాల షూటింగ్ లను పూర్తి చేసుకుంది. 

మూవీ లు త్వరలో విడుదల కాబోతున్నాయి. ఈ సినిమా లతో పాటు సమంత , విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషి మూవీ లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ మూవీ తో సమంత పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  అలాగే సమంత ఒక హాలీవుడ్ మూవీ లో కూడా నటించబోతుంది.  మరి ప్రస్తుతం కమిట్ అయిన సినిమాల తర్వాత తాప్సి నిర్మాణ సంస్థ లో సమంత సమంత నటిస్తుందా... లేకపోతే ఈ సినిమా లతో పాటు తాప్సి నిర్మించబోయే  సినిమాలో సమంత నటిస్తుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: