సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా మే 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అయిన విషయం మన  అందరికి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా ఈ సినిమాకు పరశురామ్  దర్శకత్వం వహించాడు  ఎన్నో అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన సర్కారు వారి పాట సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకొని ప్రస్తుతం థియేటర్ల వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఐదు రోజుల బాక్సాఫీస్ రన్ ని పూర్తి చేసుకున్న సర్కారు వారి పాట సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం...

మొదటి రోజు 1: 36.01 కోట్లు
రెండవ రోజు : 11.04  కోట్లు
మూడవ రోజు : 12.01 కోట్లు
నాలుగవ రోజు : 12.06 కోట్ల కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర సాధించిన సర్కారు వారి పాట సినిమా 5 వ రోజు
 నైజాం : 1.12 కోట్లు
సీడెడ్ : 52 లక్షలు
యూ  ఎ : 69 లక్షలు
ఈస్ట్ : 38 లక్షలు
వెస్ట్ : 24 లక్షలు
గుంటూర్ : 25 లక్షలు
కృష్ణ : 26 లక్షలు
నెల్లూర్ : 18 లక్షలు


 ఇప్పటివరకు అయిదు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని పూర్తి చేసుకున్న సర్కారు వారి పాట సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో  3.64 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేయగా, 6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది. మొత్తంగా ఐదు రోజుల బాక్సాఫీసు రన్ కి గాను సర్కారు వారి పాట సినిమా బాక్సాఫీస్ దగ్గర  74.76 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేయగా,  108.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర వసూలు చేసింది. ఐదు రోజుల బాక్సాఫీస్ రన్ కి గాను సర్కారు వారి పాట సినిమా ప్రపంచవ్యాప్తంగా 91.37 కోట్ల షేర్ , 143.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: