ఇటీవల విడుదల అయ్యి భారీ బడ్జెట్ సినిమాలు అంటే..ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చాప్టర్ 2, భీమ్లా నాయక్ సినిమాలు బాక్సాఫీస్ రికార్డ్ కలెక్షన్స్ రాబట్టాయి..మంచి హిట్ టాక్ ను కూడా అందుకున్నాయి..దాంతో వీటి జోరు ఇంకా వినిపిస్తోంది.అయితె ఈ సినిమాలు పై అందరి దృష్టి పడుతుంది.భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు, అధిక కలెక్షన్స్ ను కూడా వసూల్ చేయడం పై దర్షక నిర్మాథలు ఫోకస్ పెట్టారు.ప్రశాంత్ నీల్, జక్కన్నలైతే పాన్ ఇండియా రిలీజ్ లతో ఏకంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి వరల్డ్ వైడ్ సౌత్ సత్తా చాటారు. గతేడాది అఖండ, పుష్ప కూడా కమర్షియల్ సక్సెస్ కొట్టినవే. అయితే ఇప్పుడు అందరి దృష్టి నెక్ట్స్ రానున్న సౌత్ సినిమాలపైనే...


 మరో క్రేజీ సౌత్ ప్రాజెక్ట్ ఎప్పుడొస్తుందా అని వరల్డ్ వైడ్ ఉన్న ఇండియన్ ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. కరొన తర్వాత సౌత్ సినిమాలు ఊపును పెంచాయి.కేజీఎఫ్2 లాంటి సినిమా ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురుపిస్తూనే ఉంది. ట్రిపుల్ ఆర్, పుష్ప లాంటి సినిమాలు నార్త్ ఆడియెన్స్ ను బాగానే అలరించాయి. అఖండ, బంగార్రాజు, భీమ్లానాయక్ లాంటి రీజనల్ మూవీస్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ అనిపించుకున్నాయి. వలిమై, బీస్ట్ తమిళనాడులో, జేమ్స్ కి కర్ణాటకలో మంచి ఆదరణే దక్కింది. ఇక నెక్ట్స్ సౌత్ నుంచి రానున్న సినిమాలపై కాస్త ఫోకస్ పెరిగింది.


విజయ్ దేవరకొండ, సమంత జంటగా, శివ నిర్వాణ డైరెక్షన్ లో ఈమధ్యే ఇంటెన్స్ లవ్ స్టోరీ సెట్స్ పైకెళ్లింది. షూటింగ్ కూడా యమా స్పీడ్ గా సాగుతోంది. పవన్ హిట్ టైటిల్ ఖుషి పేరుతోనే ఈ సినిమా రాబోతుంది.అన్నింటికి మించి సౌత్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న క్రేజీ సినిమాలు ఎప్పుడొస్తాయా అని చూస్తున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ అదిపురుష్ రిలీజ్ కు రెడీ అవుతోంది. 2023 సంక్రాంతికి ఆదిపురుష్ ని తీసుకొస్తామని మేకర్స్ ప్రకటించారు కూడా. 350 కోట్లు బడ్జెట్ తో ఆదిపురుష్ తెరకెక్కింది. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ప్రభాస్, ప్రశాంత్ నీల్ మూవీ సలార్ రూపొందుతోంది...ఈ సినిమాను మరో రెండేళ్ళు పాటు తెరకెక్కించి తర్వాత విడుదల చెయనున్నారు..ఇలా స్టార్ హీరోల నుంచి చిన్న హిరొల సినిమాల పై ఫోకస్ పెరిగింది..

మరింత సమాచారం తెలుసుకోండి: