సర్కారు వారి పాట సినిమాకు మొదటి రోజు నుం చే నెగిటివ్ టాక్ రావడం మొదలైంది. కారణం ఏదైనా కూడా సూపర్ స్టార్ అభిమానులు ఈ నెగెటివ్ టాక్ ను అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రం పై పాజిటివ్ బజ్ తెచ్చి సూపర్ హిట్ చేసి ఈ సినిమాకు ఇంతటి స్థాయి వసూళ్లు రావడానికి కారణం అయ్యారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల నుంచి విశేష స్పంద న అందుకుంది అయినప్పటికీ వచ్చిన టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల మీద కలెక్షన్లలో కొల్లగొడుతోంది.

సర్కారు వారి పాట సినిమా ఐదు రోజులలో ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల వసూళ్లను సాధించినట్లు గా మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. దీంతో అత్యంత వేగంగా ఈ మార్క్ ను అందుకున్న సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇది మహేష్ కు ఐదవ  100కోట్ల సినిమా కావడం విశేషం. వరుసగా నాలుగవ సినిమాతో ఆయన 100 కోట్ల క్లబ్లోకి చేరాడు. ఇక నైజాం లోనే ఆయన ఎక్కువ కలెక్షన్లను సాధించినట్లు తెలుస్తోంది.

 నైజాంలో 30 కోట్ల షేర్ వసూలు చేసిన మహేష్ బాబు. ఇక్కడ ఈ కలెక్షన్స్ సాధించిన మూడవ చిత్రం గా సర్కారు వారి పాట చిత్రం నిలిచింది. ఏదేమైనా ఈ సినిమాను డిజాస్టర్ చేయాలని ఎంత ప్రయత్నించినా కూడా కొంతమంది యాంటీ ఫ్యాన్స్ కి ఈ ఫిగర్స్ నిద్రపట్టని ఇవ్వటం లేదని చెప్పాలి. 100 కోట్ల క్లబ్లోకి చేరడం అంటే మామూలు విషయం కాదు ఈ సినిమా ద్వారా మహేష్ సాధించిన విజయం భవిష్యత్తులో ఆయన మరిన్ని రికార్డులు సృష్టించడానికి కారణమవుతుంది. మరి ఈ సినిమా భవిష్యత్ లో ఏ స్థా యి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: