అక్కినేని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూపులు చూస్తున్న
సినిమా ఏజెంట్. గత నాలుగు సంవత్సరాలుగా అభిమానులకు పూర్తి స్థాయి విజయాన్ని తెచ్చి పెట్టలేక పోతున్న ఈ సినిమాతో తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాడు అని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ
సినిమా మొదలై చాలా రోజులు అవుతుంది. అయితే షూటింగ్ పూర్తి చేసుకోకపోవడం ఇంకా విడుదల కాకపోవడం వంటివి అక్కినేని అభిమానులను ఎంతగానో ఖుషీ చేస్తుంది.
దానికి తోడు ఈ
సినిమా విడుదల విషయంలో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు షికార్లు చేస్తున్నాయి.ఇంకా ఒక షెడ్యూల్ షూటింగ్ ఉండటంతో ఈ
సినిమా విడుదల ఆలస్యం అవుతుందని చెబుతున్నారు. ఇంకొక వైపు ఈ
సినిమా నిర్మాతలకు మరియు దర్శకుడుకి విభేదాలు రావడంతో ఈ
సినిమా ఆగిపోయిందని కూడా కొంతమంది చెబుతున్నారు. దానికి తోడు మరింత ఆలస్యం కావడంతో ఈ చిత్రం విడుదల కావడం లేదని చెబుతున్నారు.
సురేందర్ రెడ్డి లాంటి దర్శకుడు
అఖిల్ తో
సినిమా చేయడం అంటే నిజంగా అది ఓ మంచి
మాస్ మసాలా సినిమాని అవుతుంది. ఇలాంటి సమయంలో
అఖిల్ సినిమా వివాదంలో ఉంది అంటే అందరినీ ఎంతో గందరగోళానికి గురి చేస్తుంది.
అయితే ఈ పుకార్ల కి
నిర్మాత చాలా క్లియర్ గా స్పష్టత ఇచ్చాడు. మీడియాలో ఏజెంట్
సినిమా గురించి వస్తున్న పుకార్లు నిజం కావని ఆయన వెల్లడించారు
సినిమా అనుకున్నట్లుగానే అన్నీ జరుగుతున్నాయి అని స్పష్టం చేశాడు. ఆ విధంగా
అఖిల్ సినిమా విషయంలో అభిమానులకు ఉన్న అన్ని అనుమానాలు తొలగి పోయినట్లు అయ్యాయి. ఈ
సినిమా లుక్స్ వచ్చిన తర్వాత ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. విభిన్నమైన పాత్రలో
అఖిల్ నటిస్తున్నాడు. మరి ఈ
సినిమా ఆగస్టులో విడుదల చేయడానికి సిద్ధం అవుతున్న విషయమై క్లారిటీ వచ్చేసినట్లే.