టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అగ్ర నిర్మాతగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల ను వరుసగా నిర్మించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేస్తున్న సినిమాను మొదలు పెట్టిన ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వం లో విజయ్ హీరోగా నటించబోయే సినిమాను మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో కూడా పలు చిత్రాలను అన్ని భాషలకు పైగానే చేస్తూ ఉండటం విశేషం. ఆ విధంగా రామ్ చరణ్ సినిమాకు సంబంధించిన ఓ విషయం బయటకు వస్తుంది.

ఇప్పటిదాకా ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. ఆ సమయం లో ఈ చిత్రాన్ని విడుదల చేయడం ప్రమాదం అని గుర్తించి తను నిర్మిస్తున్న మరొక ఆ పండగ సీజన్లో విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నాడు. ఆ విధంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ దళపతి హీరోగా చేస్తున్న ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని ఏ విధంగా చెప్పి ఒప్పిస్తాడు దిల్ రాజు అనేది చూడాలి. ఇకపోతే ఆయన నిర్మాణం వహించిన సినిమా ఎఫ్ 3 మే 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

గతంలో సంచలన విజయాన్ని అందుకున్న ఎఫ్ 2 చిత్రం కు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇకపోతే ఇటీవలే బాలీవుడ్లో ఆయన నిర్మించిన జెర్సీ సినిమా రీమేక్ విడుదలయ్యింది ఆ చిత్రానికి అక్కడ మంచి పేరే వచ్చింది. తప్పకుండా సినిమా ఘన విజయం సాధిస్తుందని ముందే ఊహించాడు దిల్ రాజు. ఆ విధంగానే ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది మరి భవిష్యత్తులో ఆయన ఇంకెన్ని మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: