టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు  కథానాయకుడిగా నటించిన మాస్ మెసేజ్ ఓరియేంటెడ్ చిత్రం 'సర్కారు వారి పాట' . గీతా గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్‌ ఇంకా అలాగే జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ కలిసి నిర్మించాయి.మే 12 వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. వరుస విజయాలు సాధించిన మహేష్ తన కెరీర్‌లో ఈ సినిమాతో మరో సక్సెస్‌ను సొంతం చేసుకున్నారు. కలెక్షన్స్ విషయంలో మహేష్ బాబు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాడు. ఇక ప్రపంచ వ్యాప్తంగా 5 రోజులకు కలిపి రూ.109 కోట్లు షేర్ సాధించటం విశేషం.అదే గ్రాస్ వసూళ్ల ప్రకారం ఇది రూ.170  కోట్ల మార్కును టచ్ చేసి బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధించింది. 



ఇక ఆరవ రోజుతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి మరింత దగ్గర అయ్యింది. ఇక మొత్తం ఆరు రోజులకు గాను సర్కారు వారి పాట సినిమా 119 కోట్ల షేర్ ని రాబట్టింది. అలాగే 181 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.'సర్కారు వారి పాట' సినిమా  రూ.120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది. ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్ ప్రకారం చూస్తే కేవలం మరో 2 కోట్ల రూపాయలు వస్తే సినిమా బ్రేక్ ఈవెవ్ అయినట్లే. అలాగే గ్రాస్ పరంగా కూడా ఈ సినిమా 200 కోట్ల వైపు దూసుకువెళుతుంది.ఇంచు దూరంలో 200 కోట్ల వైపు దూసుకెళ్తుంది ఇక ఇదే స్పీడు కొనసాగితే మరో మూడు నాలుగు రోజుల్లోనే సర్కారు వారి పాట భారీగా లాభాలు సాధిస్తుంది.అలాగే యూఎస్ లో కూడా ఈ సినిమా హవా బాగా కొనసాగుతుంది. యూ ఎస్ లో 2.2 మిలయన్ డాలర్లు సాధించి స్టడిగా దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: