సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద సక్సెస్ కొట్టిన విషయం తెలిసిందే. సీనియర్ నటి నదియా, సముద్రఖని, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్యమైన పాత్రలు చేసిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఎంతో భారీ వ్యయంతో నిర్మించగా రాక్ స్టార్ థమన్ దీనికి సంగీతం అందించారు.

మొదటి నుండి కూడా అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా మొత్తంగా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుని సూపర్ గా దూసుకెళ్తుండడంతో యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. మహేష్ బాబు ఒక డ్యాషింగ్ రోల్ లో కనిపించిన ఈ సినిమాలో ఆయనకి జోడిగా కీర్తి సురేష్ నటించగా మది కెమెరా మ్యాన్ గా వ్యవహరించారు. యువ దర్శకుడు పరశురామ్ పెట్ల అన్ని వర్గాల ఆడియన్స్ ని ముఖ్యంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకునేలా సర్కారు వారి పాట తెరకెక్కించి సక్సెస్ అయ్యారు.

అయితే విషయం ఏమిటంటే, వరుసగా మొదటి నాలుగు రోజులు విపరీతమైన కలెక్షన్స్ రాబట్టిన సర్కారు వారి పాట సోమవారం నుండి కూడా మంచి స్టడీ గా కొనసాగుతోందని, అయితే అక్కడక్కడా చాలా స్వల్పమైన డ్రాప్స్ తప్పించి మెజారిటీ కేంద్రాల్లో మూవీ ఎంతో బాగా రన్ అవుతోందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇప్పటికే రూ. 100 కోట్ల మార్క్ షేర్ సొంతం చేసుకున్న సర్కారు వారి పాట మూవీ సూపర్ స్టార్ మహేష్ మ్యానియాతో రాబోయే రోజుల్లో ఎంత మేర కొల్లగొడుతుందో చూడాలి. ఇక ఈ సినిమా సక్సెస్ తో మహేష్ బాబు కెరీర్ పరంగా రెండవ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టగా, కెరీర్ పరంగా కొన్నాళ్ల నుండి సరైన సక్సెస్ కోసం చూస్తున్న కథానాయిక కీర్తి సురేష్ కూడా మంచి బ్రేక్ అందుకున్నట్లైందని, అలానే సర్కారు వారి పాట అటు నిర్మాతలకు, ఇటు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు కూడా కాసులు కురిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: