హీరో ఆది పినిశెట్టి హీరోయిన్ నిక్కీ గల్రాని ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట ఈరోజు సాయంత్రం వివాహబంధంతో ఒక్కటయ్యారు. చెన్నైలోని ఓ ఫంక్షన్లో వీరి వివాహ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. మెహంది ఫంక్షన్ కూడా పూర్తి చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఫోటోలు కూడా చాలా వైరల్ గా మారుతున్నాయి. ఒక బుధవారం సాయంత్రం అట్టహాసంగా జరిగిన ఈ వివాహ వేడుకలో ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని కుటుంబ సభ్యులతో కలిసి, నటీనటులు వీరి వేడుకలకు పాల్గొన్నారు.

మంగళవారం సంగీత కార్యక్రమం నిర్వహించగా బుధవారం రోజున ఉదయం హల్దీ వేడుకలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ వేడుకలో హీరో ఆది పినిశెట్టి కి అత్యంత స్నేహితుడైన హీరో నాచురల్ స్టార్ నాని, సందీప్ కిషన్ తో పాటుగా డిజైనర్ నిరంజన్ కూడా పాల్గొన్నారు. ఈ వేడుకకు అనంతరం వధూవరులు హీరో నాని, సందీప్ కిషన్, నీరజ్ తో కలిసి స్టెప్పులు వేయడం జరిగింది. అందుకు సంబంధించి ప్రస్తుతం వీడియో వైరల్ గా మారుతోంది.

నాని అభిమానులు సైతం ఈ వీడియోని వైరల్గా చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా ఆది పినిశెట్టి నిక్కీ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2015 వ సంవత్సరంలో వచ్చిన తమిళ యాగవరాయినమ్ నా కాక్క' చిత్రంతో తొలిసారిగా వీరిద్దరూ కలిసి నటించారు. ఇక ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది స్నేహమే ప్రేమగా మారిందట. ఇక వీరి ప్రేమ వ్యవహారాన్ని పెద్దలను ఒప్పించి పెళ్లి పీటల దాకా తీసుకు వచ్చారు. ఇక వీరి కుటుంబాలు కూడా వీరిరువురి ప్రేమను అంగీకరించి వివాహం చేశారు. తెలుగు లో ఒక విచిత్రం, నిన్ను కోరి, రంగస్థలం వంటి చిత్రాలలో నటించి మంచి నటుడిగా పేరు పొందాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: