యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తన క్రేజ్ ని పెంచుకున్నాడు. ప్రభాస్ 'బాహుబలి' సినిమా తర్వాత సాహో,  రాధే శ్యామ్ సినిమాలలో హీరోగా నటించినప్పటికి ఈ సినిమాలు ప్రభాస్ కి బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయాలను అందించలేకపోయాయి.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్, ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆది పురుష్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఆది పురుష్ సినిమా మైథిలాజికల్ డ్రామా  గా తెరకెక్కుతోంది.  ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా,  కృతి సనన్ సీత పాత్రలో కనిపించబోతుంది.

  అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్మూవీ లో రావణుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ ని 2021 ఫిబ్రవరి లో ప్రారంభించారు. అదే అదే సంవత్సరం నవంబర్‌ నెల వరకు ఈ మూవీ షూటింగ్ ని పూర్తి చేశారు. ముంబై లో వేసిన ప్రత్యేక సెట్ లోనే ఆది పురుష్  మూవీ ఎక్కువ భాగం షూట్ ని జరుగుతుంది. ఈ మూవీ కోసం కోసం లేటెస్ట్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని చిత్ర బృందం ఉపయోగించింది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. కాకపోతే ఈ సినిమాకు భారీ విఎఫ్ఎక్స్ చేయవలసి ఉండడంతో సినిమా పూర్తి అయిన ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కానీ ఇతర ప్రచార చిత్రాలు కానీ ఏవి ఇప్పటివరకు చిత్ర బృందం విడుదల చేయలేదు. ఈ సినిమాను తెలుగు,  హిందీ భాషల్లో ఒకే సమయంలో షూట్ చేస్తున్నారు.

 ఇది ఇలా ఉంటే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ను పోయిన సంవత్సరం సంక్రాంతి కి ప్రభాస్ అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే చిత్ర బృందం ఎలాంటి ఫస్ట్ లుక్ పోస్టర్ ను పోయిన సంవత్సరం శ్రీ రామ నవమి రోజు విడుదల చేయలేదు.  ఈ సంవత్సరం శ్రీరామనవమికి అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేస్తుంది ఏమో అని ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. కాకపోతే ఈ సంవత్సరం కూడా ఈ మూవీ కి సంబంధించిన ఎలాంటి ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేయలేదు.  దానితో ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: