సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట తో కెరీర్ పరంగా డబుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టారు. ఇటీవల వరుసగా మూడు సక్సెస్ లు కొట్టి మంచి జోరు మీదున్న సూపర్ స్టార్ కి లేటెస్ట్ సర్కారు వారి పాట పెద్ద సక్సెస్ మరింత క్రేజ్ ని తెచ్చిపెట్టింది. దానితో తదుపరి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఆయన చేయనున్న భారీ ప్రాజక్ట్ పై అందరికి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక గతంలో మహేష్ తో త్రివిక్రమ్ అతడు, ఖలేజా మూవీస్ తీశారు. వీటిలో అతడు మంచి సక్సెస్ కొట్టగా, ఖలేజా మాత్రం ప్లాప్ అయింది. అయినప్పటికీ కూడా ఈ రెండు సినిమాలపై ఆడియన్స్ లో ఇప్పటికీ కూడా క్రేజ్ తగ్గలేదు. ఆ విధంగా కల్ట్ క్లాసిక్స్ గా నిలిచిన ఈ రెండు సినిమాలు ఇప్పటికీ టివి ఛానల్స్ లో ప్రసారం అయితే చాలు మంచి రేటింగ్స్ ని దక్కించుకుంటూ ఉంటాయి. ఇక త్వరలో మహేష్, త్రివిక్రమ్ చేయనున్న మూవీ పట్టాలెక్కనుండడంతో ఆ సినిమా ఎలా ఉండనుంది అనే ఆసక్తి మహేష్ ఫ్యాన్స్ లో అయితే మరింతగా ఉంది.

మంచి యాక్షన్ తో పాటు స్టైలిష్ కమర్షియల్ డ్రామా మూవీ గా త్రివిక్రమ్ ఈ సినిమాని తెరకెక్కించనున్నారని, మహేష్ బాబు తన కెరీర్ లో ఇప్పటివరకు పోషించని ఒక విభిన్న పాత్ర ఈ సినిమాలో చేస్తున్నారని, ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ నే కాదు ఆడియన్స్ ని కూడా ఆయన క్యారెక్టర్ ఎంతో ఆకట్టుకుంటుందని ఇన్నర్ వర్గాల టాక్. గతంలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలని మించేలా మరింత అద్భుతంగా పక్కాగా పెద్ద సక్సెస్ కొట్టే విధంగా ఈ సినిమా కథ, కథనాలు సిద్ధం చేసిన త్రివిక్రమ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మూవీ తీసేందుకు సిద్ధం అయ్యారట. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో రూపొందనున్న ఈ మూవీలో మహేష్ కి జోడిగా పూజా హెగ్డే నటించనుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: