రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు శంకర్ ఒక భారీ పాన్ ఇండియా మూవీ తీస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతు న్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. రామ్ చరణ్ కి జోడీగా కియారా అద్వానీ నటిస్తున్న ఈ మూవీలో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమలకి చెందిన పలువురు ముఖ్య నటులు కీలకపాత్రలు చేస్తున్నట్లు టాక్.

రాక్ స్టార్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అటు మెగా ఫ్యాన్స్ లో మాత్రమే కాదు యావత్ ఆడియన్స్ అందరిలో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి కొన్నేళ్ల క్రితం తన కెరీర్ బిగినింగ్ లో మెగాస్టార్ చిరంజీవి తో తాను ఒక సినిమా చేయాలని భావించానని, అయితే కొన్ని అనివార్య కారణాల వలన అది కుదరలేదని, అయితే ప్రస్తుతం మెగాస్టార్ తనయుడు చరణ్ తో తనకు సినిమా తీసే ఛాన్స్ రావడం ఎంతో  ఆనందంగా ఉందని ఇటీవల శంకర్ మాట్లాడుతూ చెప్పారు.  మరోవైపు ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఒక వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే, తాజా రాజకీయ అంశాల నేపథ్యంలో మంచి యాక్షన్ తో పాటు పక్కాగా సాగె కమర్షియల్ జానర్ మూవీ గా శంకర్ ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తీస్తున్నట్లు టాక్. ముఖ్యంగా మెగా అభిమానులతో పాటు ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమా చూసి థ్రిల్ అయ్యేంత అద్భుతంగా ఆయన ఎంతో పకడ్బందీగా స్క్రిప్ట్ సిద్ధం చేశారట. ఇప్పటికే నలభై శాతం పైగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ త్వరలో ఫారిన్ లో షూటింగ్ జరుపుకోనుందని, అయితే ముందుగా అనుకున్న విధంగా మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి కాకుండా సమ్మర్ కి దీని విడుదల వాయిదా వేసినట్లు టాక్. కాగా ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే శంకర్, చరణ్ ల ఈ భారీ మూవీ, రిలీజ్ తరువాత బాక్సాఫీస్ దగ్గర రచ్చ రంబోలా చేయడం చాలా వరకు ఖాయంగా కనపడుతోందని అంటున్నారు విశ్లేషకులు.



మరింత సమాచారం తెలుసుకోండి: