మే 28న విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు జయంతి అన్న సంగతి తెలిసిందే. అయితే తెలుగు వారి యుగపురుషుడు, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన నాయకుడు, అంతేకాదు ఎందరో అభిమానులకు ఆరాధ్యదైవం అయిన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి.అయితే ఈ సారి ఆయన శత జయంతి కూడా కావడంతో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ అభిమానులు,మరియు  తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.అయితే ఇక ఉదయం నుంచే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని ఆయనకు నివాళులు....

 అర్పిస్తున్నారు. ఇదిలావుంటే తాజాగా సినీనటుడు రాజేంద్రప్రసాద్‌ ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు. దీని అనంతరం ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గురించి మీడియాతో మాట్లాడారు.అయితే రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ”ఆయన ద్వారానే నేను మద్రాస్‌ ఫిలిం స్కూల్‌లో చేరాను.అంతేకాదు  ఆయన పెట్టిన భిక్ష వల్లే మంచి నటుడిగా మీ ముందు ఉన్నాను. ఆయన మనతో ఉన్న పది మందికి సాయం చెయడమే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి. ఇకపోతే కొన్ని సంవత్సరాలు ఆయన పక్కనే ఉండి ఆయన్ని దగ్గరగా చూసిన వ్యక్తిని నేను. అయితే సమాజమే దేవాలయం అన్న మహా మనిషి ఆయన. ఇక ఈ రోజు మా పెద్దాయన బతికి ఉంటే బంగారు పూలతో పాదపూజ చేసేవాడిని.

 అయితే ఎన్టీఆర్‌ ఎక్కడ ఉన్నా వారి ఆశీస్సులు మన అందరిపైనా ఉంటాయి'' అని తెలిపారు.ఇక రాజేంద్రప్రసాద్ తో పాటూ మెగాస్టార్ చిరంజీవి సైతం సోషల్ మీడియా వేదికగా స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు..ఈ మేరకు చిరు పోస్ట్ చేస్తూ ''తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు, నవరస నటనా సార్వభౌముడు, తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం, శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి'' అంటూ రాసుకొచ్చారు...

మరింత సమాచారం తెలుసుకోండి: