ఇటీవల అల్లు అర్జున్ నుండి వచ్చిన సినిమా పుష్ప బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ వద్ద బ్యాండ్ బజావో అంటూ కలెక్షన్ లు రాబట్టింది. బాలీవుడ్ లోను ఈ సినిమా సూపర్ హిట్ ను అందుకుని కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ యాక్షన్ కు ఫ్యాన్స్ మాత్రమే కాదు విమర్శకులు సైతం విజిల్స్ వేశారు. అంతగా తన నటన తో అబ్బుర పరిచారు అల్లు అర్జున్. అదే విధంగా శ్రీ వల్లి పాత్రలో రష్మిక మందన్న కూడా మతి పోగొట్టేసింది. ఢీ గ్లామరస్ పాత్రలో కూడా యువతను ఉర్రూతలూగించింది రష్మిక. అయితే ఈ సినిమాకి కొనసాగింపుగా పార్ట్ 2 ఉండబోతుందని తెలిసిందే. కాగా పుష్ప పార్ట్ 2 గురించి ఇపుడు ఓ ఆసక్తికర వార్త సంచలనంగా మారింది.

పార్ట్ 1 లో  రష్మిక పాత్ర చాలా కీలకం కాకపోయినప్పటికీ గ్లామర్ మాత్రం చాలా ప్లస్ అయ్యిందనే చెప్పాలి.  అయితే పార్ట్ 2 లో ఆ పాత్ర యొక్క ప్రాముఖ్యతను తగ్గించనున్నారట దర్శకుడు సుకుమార్. చాలా వరకు ఆమె పాత్రను తగ్గించనున్నారట.. వీలయితే  ఆ పాత్రను పూర్తిగా తొలగించే ఉద్దేశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంటే రష్మిక పాత్రను చంపేసే సీన్లు క్రియేట్ చేసినా చేయొచ్చు అంటున్నారు. పార్ట్ 2 లో యాక్షన్, ఎమోషనల్ సీన్ల డోసు పెంచి రష్మిక లవ్ ట్రాక్ ను తగ్గిస్తే మంచిదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

తెలుగు, మలయాళం, హిందీతో పాటు మిగిలిన భాషల్లో మంచి విజయాన్ని నమోదు చేసిన పుష్ప సినిమా సీక్వెల్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. మరి పార్ట్ 2 లో రష్మిక పాత్రను నిజంగా చంపేయబోతున్నరా లేదా అన్నది ఇంకొద్ది రోజుల్లో తెలిసే అవకాశ ఉంది. పార్ట్ 1 కు వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో ఉంచుకుని పార్ట్ 2 కి అంతకు మించిన బజ్ క్రియేట్ చేయాలని యోచిస్తున్నారట దర్శకుడు సుకుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి: