పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఇటీవలె రాధే శ్యామ్ సినిమాతో అందరిని అలరించారు. ఇదిలావుంటే తాజాగా ప్రభాస్ నీల్ ఇటీవలే 'సాలార్' షూటింగ్‌ని రీసెంట్ గా ప్రారంభించాడు మరియు ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం 2023 వేసవిలో థియేటర్లలోకి రానుంది.అంతేకాక ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా 'ఆదిపురుష్' చేస్తున్నాడు. కాగా టీసీరీస్ సంస్థ దాదాపు 500కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇక ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోంది. అయితే ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణునిగా నటిస్తున్నారు. 

ఇక అసలు విషయం ఏమిటంటే మొన్న రాత్రి ముంబై, బాంద్రాలో ఆదిపురుష్ దర్శకుడు ఓంరౌత్ ఇంట్లో ఇచ్చిన పార్టీలో ప్రభాస్ కూడా పాల్గొన్నాడు. కాగా బ్లాక్ జీన్స్ మెరూన్ షర్ట్‌లో కొత్త లుక్ లో కనిపించాడు ప్రభాస్.ఇకపోతే గతంలో కంటే సన్నబడటం విశేషం. ఇకపోతే ఆయన సన్నబడ్డట్టు కనిపిస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.ఇక వాటిలో డార్లింగ్‌ గత కొంతకాలంగా కనిపిస్తున్న లుక్‌కు భిన్నంగా, స్మార్ట్‌గా ఉన్నారు.ఇక డైరక్టర్ ప్రశాంత్ నీల్ పట్టుబట్టడంతోనే ప్రభాస్ మేకోవర్ చేయించుకున్నాడు. అయితే సలార్ సినిమా రషెష్ చూసిన నీల్...

ప్రభాస్ బెస్ట్ ఫామ్‌లో లేడని భావించాడు. ఫిజికల్ గా అసలు ఎట్రాక్షన్ గా లేరు.కాగా  దాంతో ఇద్దరూ అందుకే 'కేజీఎఫ్ 2' రిలీజ్ కు ముందు సమావేశం అయ్యారు. ఇకపోతే రషెష్ చూసిన ప్రభాస్ సైతం అది నిజమే అని ఒఫ్పుకున్నారు.కాగా  దాంతో కనీసం 10 కిలోల బరువు తగ్గాలని ప్రభాస్‌ని కోరారు ప్రశాంత్ నీల్. ఇదిలావుంటే అతను మేకోవర్ కోసం వెళ్లే వరకు కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించనని చెప్పాడు.పోతే ఫ్యాన్స్ ... ప్రభాస్‌ శారీరకంగా మారిన తీరు ఎంతో నచ్చిందని, హ్యాండ్సమ్‌గా ఉన్నారని తెగ పోస్ట్‌లు చేస్తున్నారు.అయితే  దీంతో ఫొటోలు కాస్త వైరల్‌గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: