దగ్గుబాటి రానా ఇప్పటికే భీమ్లా నాయక్ విజయంతో మంచి ఫామ్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా భీమ్లా నాయక్  లాంటి మంచి విజయవంతమైన సినిమా తర్వాత దగ్గుబాటి రానా తాజాగా విరాట పర్వం మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విరాట పర్వం సినిమా జూన్ 17 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ సినిమాలో దగ్గుబాటి రానా రవన్న అనే నక్సలైట్ పాత్రలో నటించగా , ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.

మూవీ కి వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన,  సురేష్ బెబ్బులి ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఇది ఇలా ఉంటే అనేక అంచనాల నడుమ థియేటర్ లలో విడుదలైన విరాట పర్వం సినిమా ఇప్పటి వరకు వారం రోజుల బాక్సాఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. మరి వారం రోజుల్లో విరాట పర్వం సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం.

నైజాం : 1.31 కోట్లు , సీడెడ్ : 23 లక్షలు , యూ ఎ : 29 లక్షలు ,
ఈస్ట్ : 19 లక్షలు , వెస్ట్ : 13 లక్షలు , గుంటూర్ : 19 లక్షలు , కృష్ణ : 17 లక్షలు , నెల్లూర్ : 9 లక్షలు .
7 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విరాట పర్వం మూవీ 2.60 కోట్ల షేర్ , 4.28 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో :  0.32 కోట్లు .
ఓవర్ సీస్ లో : 1.08 కోట్లు .
ప్రపంచ వ్యాప్తంగా 7 రోజులకు గాను విరాట పర్వం సినిమా 4.00 కోట్ల షేర్ ,  6.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ప్రియమణి ఒక కీలక పాత్రలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: