ఇటీవల నందమూరి బాలకృష్ణ మరియు డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం అఖండ.ఇక  ఈ చిత్రం ఎంత విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇకపోతే ఈ సినిమాలో బాలయ్య నటన ప్రతి ఒక్క ప్రేక్షకుడిని బాగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయే పెద్ద విజయాన్ని అందించింది. ఇక దీంతో ఈ సినిమా సీక్వెల్ పై ప్రస్తుతం ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం.ఇకపోతే  తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అఖండ -2 సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో నిర్మించబోతున్నట్లు సమాచారం.

అయితే  ఈ సినిమాని అన్ని సార్వత్రిక ఎన్నికలకు ముందు 2024 ప్రారంభంలో విడుదల చేయడానికి ఎక్కువగా అవకాశం ఉందని బలంగా ప్రచారం జరుగుతోంది. ఇక అంతా కూడా ఈ సినిమాలో కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా కొన్ని కఠినమైన సన్నివేశాలు ఉండే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. పోతే రాజకీయ నేతలను టార్గెట్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాకుండా  అఖండ -2 అనేది పాన్ ఇండియా ఫిలిం అని, చిత్రబృందం కూడా మంచి బజ్ ఏర్పాటు చేస్తోంది.అయితే అఖండ, సింహ, లెజెండ్ సినిమాల తర్వాత బోయపాటి కాంబినేషన్లో వస్తున్న 4వ చిత్రం ఇది.

ఇక ఈ సినిమాకి అఖండ సినిమాలో ఎంతమంది ఉన్నారో అందరినీ అలాగే తీసుకువస్తున్నట్లు సమాచారం.ఇదిలావుంటే  నిర్మాత మిరియాల రెడ్డి..తన బావను శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో హీరోగా చేయడానికి ప్రస్తుతం ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అఖండ-2 వస్తుందని సమాచారం.కాగా డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా హీరో రామ్ తో సినిమా అయిపోయిన వెంటనే అఖండ-2 తీయబోతున్నట్లు సమాచారం. అయితే మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే చిత్ర బృందం ఈ సినిమాపై క్లారిటీ ఇవ్వవలసి ఉంటుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: