యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శీను నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబినేషన్ అంటేనే సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాలను అందుకుంటారనే సెంటిమెంట్ అయితే ప్రతి ఒక్కరిలోనూ ఉంది.


ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా లెజెండ్ అఖండ సినిమాలు మూడు కూడా బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ప్రస్తుత కాలంలో థియేటర్లో ఒక్క సినిమా నెలరోజులు కూడా రన్ అవడం కష్టతరంగా ఉంది. అలాంటిది అఖండ సినిమా ఏకంగా వంద రోజులను పూర్తి చేసుకొని సంచలనం సృష్టించిందట.


ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య నటించిన ఆ ఘోర పాత్ర ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుందని చెప్పవచ్చు .ఇకపోతే బాక్సాఫీస్ వద్ద ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారట. పాన్ ఇండియా స్థాయిలో అఖండ 2 చిత్రాన్ని నిర్మించాలని నిర్మాతలు పెద్దఎత్తున ఈ సినిమా సీక్వెల్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమా కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా రాజకీయాలతో ముడిపడి ఉండడం వల్ల ఈ చిత్రాన్ని 2024 ఎన్నికల ముందు విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయట.


 


ఇకపోతే ప్రొడ్యూసర్ మిరియాల రవీందర్ రెడ్డి తన భావను హీరోగా పరిచయం చేయనున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మిరియాల రవీందర్ రెడ్డి తన బావను హీరోగా పరిచయం చేస్తూ సినిమా చేస్తున్నారట. ఈ సినిమా పూర్తి కాగానే అఖండ సీక్వెల్ సినిమా పనులలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం బోయపాటి శీను కూడా రామ్ సినిమాతో బిజీగా ఉన్నారట.


 


ఇక బాలయ్య సైతం గోపీచంద్ మలినేని సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమా అనంతరం అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారని తెలుస్తుంది.ఈ సినిమా పూర్తి కాగానే అఖండ సీక్వెల్ షూటింగ్లో పాల్గొంటారని సమాచారం.ఈ విధంగా అఖండ సినిమా సీక్వెల్ గురించి పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: