రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల్లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం ప్రభాస్ 'కే జి ఎఫ్' మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ సలార్ లో కూడా హీరోగా నటిస్తున్నాడు.

సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయ్యింది. ప్రస్తుతం కూడా ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రభాస్ పోస్టర్ లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ కథానాయికగా కనిపించబోతుంది. ఇప్పటికే శృతి హాసన్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా సలార్ చిత్ర బృందం విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు అయిన పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు, అని అనేక వార్తలు అనేక సార్లు బయటికి వచ్చాయి.

అయితే ఈ వార్తలపై తాజాగా పృథ్వి రాజ్ సుకుమారన్ క్లారిటీ ఇచ్చాడు. తాను సలార్ మూవీ లో నటించాల్సి ఉంది అని ,  ప్యాండమిక్ , కేజీయఫ్ 2 కన్నా ముందే  మూవీ కథ ని విన్నాను అని,  ఆ సమయంలో మూవీ లో నటించడానికి నేను ఓకే చెప్పాను అని, ఆ తర్వాత అంతా మారిపోవడంతో నేను ఈ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ఈ మూవీ నుండి తప్పుకున్నాను అని తెలిపాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాత్రం ప్రభాస్ మరియు నా డేట్స్ అడ్జస్ట్ అయ్యేలా ఉన్నాయి అని ప్రస్తుతం సలార్ సినిమాలో నటించే ఛాన్స్ ఉంది అని పృథ్వి రాజ్ సుకుమారన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: