టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయిన పంజా వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం గిరీశాయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ రంగ వైభవంగా  మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ లో పంజా వైష్ణవ్ తేజ్ సరసన రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ కథానాయికగా నటిస్తోంది. 

మూవీ కి  దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేసింది. రంగ రంగ వైభవంగా చిత్ర బృందం తాజాగా ఈ సినిమా టీజర్ ను జూన్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అందుకు సంబంధించి చిత్ర బృందం ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా తన కెరీర్ ని మొదలు పెట్టిన మొదటి సినిమా ఉప్పెన తోనే బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ను కూడా సంపాదించుకున్నాడు. మొదటి సినిమా తోనే అదిరిపోయే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న పంజా వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత కొండాపొలం మూవీ లో హీరోగా నటించాడు.

కాక పోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వైష్ణవ్ తేజ్ కు తీవ్ర నిరాశనే మిగిల్చింది. కొండపొలం లాంటి ఫ్లాప్ సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ 'రంగ రంగ వైభవంగా' మూవీ లో హీరోగా నటించాడు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదల అయిన పోస్టర్ లకు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకునే విధంగా ఉండటంతో రంగ రంగ వైభవంగా సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి రంగ రంగ వైభవంగా సినిమాతో వైష్ణవ్ తేజ్ ఎలాంటి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: