తెలుగు
సినిమా పరిశ్రమలో రాణిస్తే మంచి గుర్తింపు దక్కుతుంది అనేది ఇతర భాషలలోని హీరోలు భావిస్తున్నారు. పాన్
ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు దక్కించుకోవాలంటే ముందుగా తెలుగునాట అభిమానులను ఎంతగానో ఆనంద పరచాలి. అలా ఇప్పుడు తెలుగులో కొంతమంది
తమిళ హీరోలు నేరుగా సినిమాలు చేస్తున్నారు. పలు డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన చాలా మంది హీరోలు ఇప్పుడు
డైరెక్టర్ సినిమాలు చేయడానికి సిద్ధం అవుతున్నారు.
అంతే కాదు పాన్
ఇండియా దర్శకులుగా ఎదగడానికి డైరెక్టర్లు సైతం తెలుగు హీరోలతో కలిసి సినిమాలు చేస్తున్నారు. ఏదేమైనా పాన్
ఇండియా స్టార్ గా ఎదగడానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది
టాలీవుడ్ చిత్ర పరిశ్రమ. ఆ విధంగా ఇప్పుడు ఓ మలయాళ
హీరో తెలుగులో
మార్కెట్ పెంచుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. ఆయనే పృథ్వీరాజ్ సుకుమారన్. మలయాళ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా
హీరో గా నటుడిగా పలు రకాల పాత్రలు పోషించి స్టార్ గా ఎదిగాడు పృథ్విరాజ్.
తెలుగులో కూడా ఆయనకు మంచి అభిమానం ఉన్నారు. పలు డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆయన ఇప్పటికే అలరించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన జనగణమన
సినిమా కూడా భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఓ టీ టీ లో విడుదలైన కూడా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన హీరోగా తెరకెక్కిన ఈ
సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం సక్సెస్ అయితే ఆయన కూడా నేరుగా
సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నారట. మరి
పృథ్వీ రాజ్ సుకుమారన్ ఇక్కడ కూడా ఆల్ రౌండర్ అనిపించుకునే విధంగా సినిమాలు చేస్తారా అనేది చూడాలి. ఇప్పటికే ఓ తెలుగు
డైరెక్టర్ తో అయన
సినిమా చేయడానికి రెడీ అయ్యారని తెలుస్తుంది.