సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన డీజే టిల్లు సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లను సాధించగా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. హీరోయిన్ గా నటించిన నేహా శర్మ కి కూడా ఈ చిత్రం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఇప్పుడు ఆమెకు హీరోయిన్ గా పలు మంచి అవకాశాలు వస్తున్నాయి. పెద్ద హీరోలు కూడా ఆమెను తమ సినిమాల్లో పెట్టుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

 అందం అభినయంతో పాటు మంచి గ్లామర్ కూడా కడప వస్తుండడంతో ఈమెకు గ్లామర్ ఫీల్డ్ లో మంచి ఫ్యూచర్ ఉంది అని జోస్యం చెబుతున్నారు సినిమా పండితులు. ఇక  హీరోగా తెలుగు సినిమా పరిశ్రమలోకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అయినా కూడా మంచి విజయం లేక నార్మల్ హీరోగా ఉండిపోయిన సిద్దు ఈ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని హీరోగా నిలదొక్కుకున్నాడు.  ప్రయత్నం చేస్తే ఎప్పటికైనా ఈ కలను నిజం చేసుకోవచ్చు అనడానికి సిద్దు జొన్నలగడ్డ సినిమా ప్రయాణమే నిదర్శనం. 

ఆ విధంగా డీజే టిల్లు సినిమా తో మంచి క్రేజ్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించే పని లో పడ్డాడు. నిన్న ఈ సినిమా యొక్క షూటింగ్ కూడా మొదలైంది. తొందర్లోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఈ చిత్రం మొదటి భాగం స్థాయిలో విజయాన్ని అందుకుంటుంది అనేది చూడాలి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు మరికొన్ని రోజులలో తెలియనన్నాయి. ఈ చిత్రంతో పాటే మరికొన్ని పెద్ద బ్యానర్లలో సిద్దు జొన్నలగడ్డ సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు.ఇదే స్థాయి లో సినిమాలు చేస్తే అయన స్టార్ హీరో గా ఎదగడం ఖాయం అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: