పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో
విజయ్ దేవరకొండ హీరోగా ఓ
సినిమా తెరకెక్కుతోంది. ఆగస్టు 25 వ తేదీన విడుదల కాబోతున్న ఈ
సినిమా కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా తాజాగా ఈ సినిమాలోని ఓ ప్రమోషనల్ సాంగ్ షూటింగ్ చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ముంబైలో ఈ పాటకు సంబంధించిన షూటింగ్ జరుగుతూ ఉండగా ఇందులో రౌడీ బాయ్
విజయ్ దేవరకొండ వేసే స్టెప్పులు ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరిస్తాయని చెబుతున్నారు.
ఈ పాటలో ఆయనతో పాటుగా
అనన్య పాండే స్టెప్పులు వేయబోతుందట. గతంలో ఆమెకు బదులుగా ఓ క్రేజీ
హీరోయిన్ ను ఈ పాటలో చేయించాలని అనుకున్నారు. కానీ చివరకు
హీరోయిన్ నే ఎంపిక చేశారు. ఏదేమైనా
విజయ్ దేవరకొండ చేస్తున్న తొలి పాన్
ఇండియా సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. తెలుగునాడు మొత్తం ఈ
సినిమా కోసం ఇప్పుడు ఎదురు చూస్తూది.
కరణ్ జోహార్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈ చిత్రానికి చార్మి మరియు
పూరి జగన్నాథ్ ఇద్దరు కూడా నిర్మాతలగా వ్యవహరిస్తూ ఉండగా ఈ చిత్రం ఇప్పటికే పలు ఫ్రీ రిలీజ్ బిజినెస్ రికార్డులను నమోదు చేసుకుంది. ఆ విధంగా రోజుకో కొత్త రికార్డులను విడుదల కాకముందే నమోదు చేసుకుంటున్న ఈ
సినిమా విడుదల తర్వాత ఎలాంటి సంచలనం రికార్డులను తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో మైక్ తైసన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మరి ఈ చిత్రం ఏ స్థాయిలో రికార్డులను సృష్టిస్తుందో తెలియాలి అంటే ఆగస్టు 25వ తేదీ వరకు వేచి చూడవలసిందే.
అనన్య పాండే ఈ చిత్రంలో
హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం తర్వాత మళ్ళీ పూరీ దర్శకత్వంలో ఓ
సినిమా చేస్తున్న
విజయ్ దేవరకొండ అంతకు ముందు
ఖుషి సినిమా తో ప్రేక్షకులను పలకరించనున్నాడు.