పవన్ కళ్యాణ్ హీరోగా కోసం కొన్ని చిత్రాలు తెరకెక్కుతున్నాయి. కాగా ఆయన సముద్రఖని దర్శకత్వంలో చేయబోయే సినిమాలు కూడా పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టాడు అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ ఈ ఎంతో సన్నిహితుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన రాజకీయాలలోకి వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలను త్రివిక్రమే దగ్గరుండి చూసుకుంటున్నారు.

ఆయన సినిమాలను ఓకే చేసే దగ్గర నుంచి ప్యాకప్ చెప్పే వరకు ప్రతి విషయాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా ఆచితూచి చూసుకుంటున్నాడు త్రివిక్రమ్. తన సినిమాలను కూడా పక్కనపెట్టి పవన్ కోసం పని చేస్తున్న త్రివిక్రమ్ ఇతర దర్శకుల సినిమాల్లో కూడా వేలు పెట్టడం వారికీ ఎంతగానో ఇబ్బంది కలిగిస్తుందట. కొన్ని లిమిట్స్ వరకు ఒకే కానీ త్రివిక్రమ్ ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం వారికి మరింత ఇబ్బంది కలిగిస్తుందట.  పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఎవరైనా త్రివిక్రమ్ ను ముందు కలవాల్సిందే అని చెబుతున్నారు. అయితే కొత్త దర్శకులు అయితే ఈ విధంగా చేయడానికి ఏమాత్రం వెనుకాడరు.

ఎందుకంటే వారికి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం ముఖ్యం. కానీ పెద్ద దర్శకులు కలవాలంటే ఆలోచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలంటే త్రివిక్రమ్ ను కలవాల్సిన అవసరం ఏమిటని వారిలో వారే గుసగుసలాడుకుంటున్నారట. ఆ విధంగా చాలా మంది దర్శకులు ఈ విధంగా ఉండటంతో పవన్ కళ్యాణ్ సినిమాలు చేయలేకపోతున్నారు. సముద్రఖని సినిమా ను సెట్ చేసి పెట్టిన ఘనత త్రివిక్రమ్. అదే సమయంలో త్రివిక్రమ్ ప్రమేయం లేకుండా ఓకే అయిన సినిమాలు ఆలస్యం అవ్వడానికి కారణం కూడా ఆయనే అని ఇండస్ట్రీలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. మరి ఈ విధమైన నెగిటివిటీ ఉన్న నేపథ్యంలో త్రివిక్రం దీనిపై ఏమని స్పందిస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: