నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందంటే మాములు విష్యమా....ఇక ఆయన అభిమానుల హడావిడి మాములుగా ఉండదు.అయితే  ఇటీవలే అఖండ సినిమా తో భారీ విజయాన్ని అందుకున్నారు బాలయ్య. ఇకపోతే బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా సంచలన విజయాన్ని అందుకుంది. కాగా బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాతో 200 కోట్ల క్లబ్ లోకి చేరి పోయారు. అయితే ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పోతే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

అంతేకాదు  సంక్రాంతి అంటే బాలయ్య సినిమా ఉండాల్సిందే.ఇక  బరిలో ఎన్ని సినిమాలున్నా బాలయ్య సినిమా మాత్రం పక్కాగా ఉంటుంది. అయితే అలాగే రాబోయే సంక్రాంతి కి గోపీచంద్ మలినేని సినిమా ఉంటుందని టాక్ వినిపించింది.ఇకపోతే బాలయ్య కెరీర్ లో 107వ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలావుంటే ఈ సినిమాను సంక్రాంతి కంటే ముందుగానే రిలీజ్ చేయాలని చూస్తున్నారట చిత్రయూనిట్. ఇకపోతే ఈ సినిమాను డిసెంబర్ మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ రిలీజ్ చేయాలనీ చూస్తున్నారట మేకర్స్.

అయితే ఈ సినిమాలో దునియా విజయ్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు.అంతేకాదు  ఇక బాలయ్యకు ఇటీవల కొరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే దాంతో షూటింగ్ కు చిన్న బ్రేక్ ఇచ్చారు.ఇదిలావుంటే  తాజాగా ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దాంతో షూటింగ్ స్పీడ్ పెంచనున్నారు. వచ్చే వారం నుంచి తిరిగి షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారట బాలయ్య.ఇకపోతే  గోపీచంద్ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలకృష్ణ.అయితే  ఇప్పటికే కథను సిద్ధం చేసిన అనిల్ మిగిలిన తరగణాన్ని సెట్ చేసే పనిలో ఉన్నారట...!!

మరింత సమాచారం తెలుసుకోండి: