శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఆయన చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకుంటుంది.  బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదలయిన తరువాత కూడా హాలీవుడ్ సైతం ఎంతగానో ఆశ్చర్యపరిచే విధంగా ఎదుగుతుంది. థియేటర్లలో దుమ్ము దులిపిన ఈ చిత్రం ఈ విధంగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా దుమ్ము దులుపుతుంది.

ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తదుపరి సినిమాగా చేయబోయే శంకర్ సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. శంకర్ తో కలిసి తన 15వ సినిమా చేస్తున్న రామ్ చరణ్ ఈ చిత్రం ద్వారా పా ఇండియా స్టార్ గా మరొక లెవెల్ కి వెళ్లాలని భవిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండడం అక్కడి ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆసక్తి పరుస్తుంది.  ఇప్పటికే పలు ప్రదేశాలలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కు ఇప్పుడు స్మాల్ బ్రేక్ ఇవ్వడంతో తన పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు చరణ్.

తాజాగా ఈ సినిమా యొక్క స్కెడ్యూలను మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ షెడ్యుల్ లో ఈ సినిమా యొక్క కీలకమైన సీన్స్ షూటింగ్ చేయబోతున్నారట. అక్కడ ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అనంతరం హైదరాబాదులో చేసే షెడ్యూల్ తో ఈ సినిమాను పూర్తి చేస్తారని అంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ సినిమా విడుదలై ఆరు నెలలైనా కాకముందే తన తదుపరి సినిమా ను  పూర్తి చేయడం చెర్రీ అభిమానులను ఎంతగానో సంతోషపెడుతుంది.

తాజాగా ఈ సినిమాకు సిటిజన్ అనే టైటిల్ ను శంకర్ ఫైనల్ చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. 1993 నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా రాబోతుందని తెలుస్తుంది.  చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: