అల్లు
అర్జున్ హీరోగా తన కెరియర్ మొదలు పెట్టినప్పటి నుంచి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క స్థాయి పైకి ఎదుగుతూ ఇప్పుడు ఐకాన్ స్టార్ గా
సినిమా పరిశ్రమలో కొనసాగుతున్నాడు. తాజాగా ఆయన చేసిన పుష్ప సినిమాతో
బాలీవుడ్ ఇండ స్ట్రీలో కూడా మంచి మార్కెట్ను అందుకున్నారు. అలా ఇప్పుడు ఆయనకు దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ఏడాది పుష్ప రెండవ భాగం సినిమాతో దానిని రె ట్టింపు చేసుకోబోతున్నారు అలా అందరి చర్చకు కారణమవుతున్న
అల్లు అర్జున్ తాజాగా మరొక ఫీట్ సాధించారు.
గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేయబడిన
హీరో లలో
అల్లు అర్జున్ టాప్ లిస్టులో ఉండడం ఆయన అభిమానులను ఎంతో సంతోషానికి గురిచేస్తుంది. సౌత్ లో అయితే ఆయన తర్వాత
ప్రభాస్ మరియు మహేష్ లు ఉన్నారు. గతంలో వీరిద్దరే ఈ రికార్డును సాధించగా వారిని దాటి
అల్లు అర్జున్ ఇప్పుడు టాప్ లిస్టులో ఉండడం మరింత విశేషం. మొత్తంగా ఏషియన్ కంట్రీస్ వైడ్ గా చూసుకుంటే
అల్లు అర్జున్ 19 వ స్థానంలో నిలిచాడు. అతను కంటే ముందుగా
సల్మాన్ షారుక్ నిలిచారు.
ఇక స్పోర్ట్స్ కేటగిరీలో
విరాట్ కోహ్లీ నెంబర్ వ న్ స్థానంలో ఉన్నాడు అలా
బాలీవుడ్ హీరోలతో సమానంగా
అల్లు అర్జున్ కు ఎక్కువ క్రేజ్ అందుకోవడం మరింత విశేషం అనే చెప్పాలి. ఇక ఆయన పుష్ప రెండవ భాగం
సినిమా పైనే మరింత కాన్సన్ట్రేషన్ చేశారు. ఈ చిత్రాన్ని తొందర్లోనే మొదలుపెట్టి వచ్చే ఏడాది విడుదల చేయాలన్నది మేకర్స్ ఆలోచన 150 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన పుష్ప మొదటిభాగం చి త్రం 360 కోట్ల వసూళ్లను సాధించగా అంతటి భారీ
సక్సెస్ సాధించిన నేపథ్యంలో పుష్ప రెండవ భాగం అంతకుమించిన అంచనాలు నెలకొన్న విధంగా తెరకెక్కించాలని భావిస్తున్నాడు.