\రాధే శ్యామ్ సినిమాతో తీవ్ర నిరాశలో ఉన్న ప్రభాస్ అభిమానులు ఇప్పుడు ఆయన చేయబోయే తదుపరి చిత్రాలు మంచి విజయాన్ని అందుకోవాలని భావిస్తున్నారు. అందుకే ప్రభాస్ కు రిక్వెస్ట్ ల మీద రిక్వెస్ట్ పెడుతున్నారు. ఓ హిట్టు సినిమా చేసి అభిమానుల ఆఖరి తీర్చాలని వారు కోరుకుంటున్నారు. బాహుబలి తర్వాత పాన్ ఇండియా మార్కెట్లో తన ఇమేజ్ను రెట్టింపు చేసుకోవడానికి బదులు ప్రభాస్ ఫ్లాప్ సినిమాలు చేసి తగ్గించుకున్నాడు.

దాంతో మళ్లీ ఫ్లాప్ పొందేలా కాకుండా ఈసారి ఘన విజయాన్ని అందుకోవాలని ఆయన భారీ దర్శకులతో మంచి సినిమాలే చేస్తున్నాడు. అలాంటి వాటిలో ఒకటి ఆదిపురుష్. రామాయణం ఆధారంగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించబోతున్నాడు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తుండగా సీతగా కృతి సనన్ రావణాసురుడు గా సైఫ్అలీఖాన్ కనిపిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను కొన్ని నెలల క్రితమే పూర్తి చేసింది చిత్రబృందం.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. గ్రాఫిక్స్ పనులకే ఎక్కువ సమయం తీసుకున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఇది కూడా తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫైనల్ వర్కులు జరుగుతున్నాయి.  కేవలం డబ్బింగ్ పనులు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి కొంతమంది నటీనటులు వారికి సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేయగా మిగిలిన వారి డబ్బింగ్ వర్కు త్వరలోనే వారు పూర్తి చేసే విధంగా సిద్ధం అవుతున్నారు. సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఇంతవరకు ఈ సినిమాలో ప్రభాస్ ఎలా కనిపిస్తాడు అన్నదానిపై ఎలాంటి పోస్టర్ కూడా విడుదల చేయలేదు. త్వరలోనే అది విడుదల చేసి ప్రభాస్ అభిమానుల కోరికను వారు తీరుస్తారా అనేది చూడాలి. చాలా రోజుల తర్వాత ఓ మైథలాజికల్ సినిమా తెరపైకి రాబోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: